Webdunia - Bharat's app for daily news and videos

Install App

5న హైదరాబాద్‌ సిటీకి రానున్న ప్రధాని నరేంద్ర మోడీ

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:55 IST)
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం హైదరాబాద్ నగరానికి రానున్నారు. హైదరాబాద్ నగరంలో జరుగుతున్న శ్రీరామానుజచార్య సహస్రాబ్ధి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ఆయన వస్తున్నారు. ఈ సందర్భంగా 11వ శతాబ్దానికి చెందిన శ్రీ రామానుజాచార్యను గౌరవించే 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో ప్రతిష్టించిన విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు. 
 
ప్రభుత్వ వర్గాల ప్రకారం, ప్రధాని నరేంద్ర మోడీ తొలుత పటాన్‌చెరులోని ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ సెమీ-ఎరిడ్ ట్రాపిక్స్ (ICRISAT) క్యాంపస్‌ను సందర్శిస్తారు, అక్కడ ఆయన ఇనిస్టిట్యూట్ 50వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు.
 
ఆ తర్వాత హైదరాబాద్ శివార్లలోని ముచ్చింతల్‌కు వెళ్లి 216 అడుగుల ఎత్తైన శ్రీరామానుజ చార్యుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. ఈ ప్రాంగణంలో ప్రధాని మోజీ కోసం ప్రత్యేకంగా హెలిప్యాడ్‌లు నిర్మించారు. అలాగే, ప్రధాని రాక సందర్భంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. అనంతరం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి ఢిల్లీకి తిరిగి వెళతారు. 

సంబంధిత వార్తలు

2024 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో తెనాలి అమ్మాయి..

మూడు డిఫరెంట్ వేరియేషన్స్ తో అజిత్ కుమార్ ద్విభాషా చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ

ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి అనిరుద్ సారథ్యంలో ఫియర్ సాంగ్’ న్యూ లుక్ విడుదల

సినారేకు నివాళిగా రాబోతున్న "నా ఉచ్ఛ్వాసం కవనం" ప్రోగ్రాం కర్టెన్ రైజర్ కార్యక్రమం

కౌంట్‌డౌన్ ప్రారంభం: మాగ్నమ్ ఓపస్ 'కల్కి 2898 AD' అప్‌డేట్

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

పెద్ద ఉల్లిపాయలు తింటే గొప్ప ప్రయోజనాలు, ఏంటవి?

ఆదివారం అంటేనే బిర్యానీ లాగిస్తున్నారా? ఇవి తప్పవండోయ్!

పనస పండ్లలోని పోషకాలేంటి..? ఎవరు తినకూడదు?

తర్వాతి కథనం
Show comments