Webdunia - Bharat's app for daily news and videos

Install App

వైకాపా నేతల ఆదాయం 3 రెట్లు పెరిగితే - ఉద్యోగుల వేతనం 30 శాతం తగ్గింది.. పవన్

Webdunia
శుక్రవారం, 4 ఫిబ్రవరి 2022 (07:38 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు గురువారం నిర్వహించి ఛలో విజయవాడ కార్యక్రమంపై జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. రాష్ట్రంలో వైసీపీ నేతల ఆదాయం మూడు రెట్లు పెరిగినా.. ఉద్యోగుల వేతనం మాత్రం 30 శాతం తగ్గిందని ఆవేదన వ్యక్తం చేశారు. పైగా, ఒక ప్రభుత్వ ఉద్యోగి బిడ్డగా ప్రభుత్వ ఉద్యోగుల ఆందోళనకు సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. 
 
ఏపీలో చలో విజయవాడ నిరసనపై ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఏమాత్రం సబబుగా లేదన్నారు. ఉద్యోగులను నిలువునా మోసం చేసిందన్నారు. ఉద్యోగ సంఘాల నేతలో జరిగిన చర్చలను రాష్ట్ర ప్రభుత్వం సమస్యను సీరియస్‌గా తీసుకోలేదన్నారు. 
 
ఉద్యోగుల సమస్యలను సముచితమైన రీతిలో పరిష్కరించడంలో విఫలమైందన్నారు. తాను కూడా ప్రభుత్వ ఉద్యోగి కుమారుడని, ప్రతి ఉద్యోగి తన కుటుంబం కోసం టీఏలు, డీఏలు, పీఆర్‌సీ ఇంక్రిమెంట్‌లను పరిగణనలోకి తీసుకుంటారన్నారు. ఎంప్లాయీస్ యూనియన్ నాయకుల ఇన్‌పుట్ ప్రకారం, హెచ్‌ఆర్‌ఎను ఎనిమిది నుండి రెండు శ్లాబ్‌లకు తగ్గించడం ద్వారా, దాని వల్ల రూ.5,000 నుండి రూ.8,000 వరకు వేతనం తగ్గుతుందని అభిప్రాయపడ్డారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కమల్ వయసు 70 - త్రిష వయసు 42 యేళ్ళు.. 'థగ్‌లైఫ్' కోసం రొమాన్స్!!

థ్యాంక్యూ పవన్ జీ.. మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.. దిల్ రాజు

హైదరాబాద్, చెన్నైలలో షూటింగ్ కు సిద్ధమైన పూరీ, విజయ్ సేతుపతి సినిమా

జే.డి. లక్ష్మీ నారాయణ లాంచ్ చేసిన కృష్ణ లీల సెకండ్ సింగిల్

కమల్ హాసన్, శింబు, మణిరత్నం థగ్ లైఫ్ నుంచి ఓ మార సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఎందుకు ప్రతి ఒక్కరూ కొలెస్ట్రాల్ పరీక్షలు చేయించుకోవాల్సిన అవసరం ఉంది?

ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీని గుర్తించకపోతే ప్రాణాంతకం, ముందుగా స్కాన్ చేయించుకోవాలి: సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్

Vitamin C Serum: మహిళల చర్మ సౌందర్యానికి వన్నె తెచ్చే విటమిన్ సి సీరం..

ఆరోగ్యానికి మేలు చేసే బఠాణీ, ఎలాగంటే?

చింత చిగురు వచ్చేసింది, తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments