Webdunia - Bharat's app for daily news and videos

Install App

రామకృష్ణ ఆత్మహత్య కేసు : తెరాస ఎమ్మెల్యే కుమారుడిని అరెస్టు చేయలేదు

Webdunia
శుక్రవారం, 7 జనవరి 2022 (08:43 IST)
తెలంగాణ రాష్ట్రంలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచకు చెందిన రామకృష్ణ కుటుంబ సభ్యులు ఆత్మహత్య కేసులో అధికార తెరాస పార్టీకి చెందిన ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు కుమారుడు వనమా రాఘవేంద్ర రావును ఏ2 నిందితుడుగా అరెస్టు చేసినట్టు వచ్చిన వార్తలపై ఆ రాష్ట్ర పోలీసులు క్లారిటీ ఇచ్చారు. వనామా రాఘవేంద్ర రావు ఇంకా పరీరాలో ఉన్నారని, ఆయన కోసం పోలీసు బృందాలు గాలిస్తూనే ఉన్నాయని పాల్వంచ ఏసీపీ రోహిత్ రాజు వెల్లడించారు. 
 
కాగా, గురువారం సాయంత్రం వనామా రాఘవేంద్ర రావును పోలీసులు అరెస్టు చేసి ఖమ్మం తరలిస్తున్నట్టు మీడియాలో వచ్చిన వార్తలు వచ్చాయని, ఆ వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదని చెప్పారు. ఈ కేసులో అరెస్టు కాకుండా బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తుండవచ్చని, అదే జరిగితే తాము కౌంటర్ పిటిషన్‌ను దాఖలు చేస్తామని తెలిపారు. 
 
మరోవైపు, ఆరోపణలు ఎదుర్కొంటున్నది తెరాస ఎమ్మెల్యే కుమారుడు కావడంతో ఆయన్ను ప్రగతి భవన్‌లోనే దాచిపెట్టారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఈ కేసులో ఏ2గా ఉన్న వనమా రాఘవేంద్రరావును ఏ1గా మార్చాలని కాంగ్రెస్ ఎంపీ కోమిటరెడ్డి వెంకట్ రెడ్డి డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్‌ మనవడిని ఒక్క మాటంటే గగ్గోలు పెట్టిన ఈ తెరాస నేతలకు, సీఎం కేసీఆర్‌కు ఓ కుటుంబం ఆత్మహత్య చేసుకున్న ఘటన కళ్ళకు కనిపించలేదా అని నిలదీశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మలయాళ మార్కో దర్శకుడు హనీఫ్ అదేనితో దిల్ రాజు చిత్రం

CPI Narayana: కాసుల కోసం కక్కుర్తి పడకండి - సినీ పరిశ్రమకి సిపిఐ నారాయణ ఘాటు విమర్శ

Samantha: ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్న సమంత

Nitin: అల్లు అర్జున్ జులాయ్ చూసినవారికి నితిన్ రాబిన్ హుడ్ నచ్చుతుందా?

కీర్తి సురేష్‌ను ఆటపట్టించిన ఐస్‌క్రీమ్ వెండర్... ఫన్నీగా కౌంటరిచ్చిన హీరోయిన్ (Video)

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Weight Loss: ఈ మూడు రోటీలు తింటే బరువు తగ్గుతారు తెలుసా?

Mental Health: గతం గతః.. వర్తమానమే ముద్దు.. భవిష్యత్తు గురించి చింతనే వద్దు..

ఉసిరి సైడ్ ఎఫెక్ట్స్, ఏంటో తెలుసా?

పుదీనా రసంలో యాలకుల పొడి తాగితే కలిగే ప్రయోజనాలు

పండ్లను ఖాళీ కడుపుతో తినవచ్చా?

తర్వాతి కథనం
Show comments