ప్రేమ పెళ్లి పెటాకులైంది.. నవవధువు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్య

Webdunia
గురువారం, 14 అక్టోబరు 2021 (16:24 IST)
ప్రేమ విఫలమైంది. ప్రేమ పెళ్లి పెటాకులైంది. వివాహం చేసుకుని రెండు నెలల కూడా నిండకముందే వారి ప్రేమలో విషాదం అలముకుంది. ప్రేమికుడిని వివాహం చేసుకున్న నవవధువు ఫ్యానుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఖమ్మం జిల్లాలో చోటుచేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. 
 
వివరాల్లోకి వెళితే.. గుదిమళ్ల పంచాయతీ పరిధిలోని నంద్యా తండాలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఈ తండాకు చెందిన ధరావత్ శైలజా, అదే గ్రామానికి చెందిన యువకుడు కొంతకాలం ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి ఓ పోరాటమే చేశారు. ఇరువైపులా పెద్దలను ఒప్పించి మరీ పెళ్లుచేసుకున్నారు. ఆగస్టు నెలలోనే వీరిద్దరు ఒక్కటయ్యారు.
 
దురదృష్టకరమేమిటంటే, పెళ్లి జరిగిన తర్వాత వారి మధ్య చిన్నచిన్న గొడవలు ప్రారంభమయ్యాయి. ఈ గొడవలపై శైలజా తరుచూ బాధపడేది. వీటి వల్లే ఆమె తీవ్ర మనస్తాపం చెంది తాను ప్రాణాలు తీసుకోవాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది. 
 
బుధవారం రోజు రాత్రి ఇంట్లో అందరూ గాఢ నిద్రలోనే ఉన్నప్పుడు ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vamsiramaraj : భగీరథకు వంశీ ఎన్ .టి .ఆర్. మహానంది గ్లోబల్ అవార్డు

Charan, Modi: ప్రధాని మోదీతో పెహ్లి' చాట్‌ను పంచుకున్న రామ్ చరణ్

అద్భుత డ్యాన్స్ టాలెంట్‌తో అదరగొట్టిన బాలయ్య చిన్న కుమార్తె (వీడియో)

హైదరాబాద్‌లో సరికొత్త ఫార్మెట్ లో ఐమాక్స్ స్క్రీన్ : సునీల్ నారంగ్

Sandigdham Review: మిస్టరీ, థ్రిల్లింగ్ కథతో నిహాల్, ప్రియా దేశ్‌పాగ్ చిత్రం సందిగ్ధం మూవీ రివ్యూ

తర్వాతి కథనం
Show comments