పత్తి చేనులో పురుగుల మందు తాగిన ఉపాధ్యాయుడు.. మృతి

Webdunia
సోమవారం, 5 అక్టోబరు 2020 (17:42 IST)
కరోనా కష్టాలు మరో యువ ఉపాధ్యాయుడి ప్రాణాలు తీశాయి. కరోనా మహమ్మారి కారణంగా లాక్డౌన్ ప్రకటించారు. ఇపుడు అన్‌లాక్ 5.0 కొనసాగుతోంది. అయినప్పటికీ పాఠశాలలు తెరుచుకోలేదు. లాక్డౌన్ కారణంగా ఉద్యోగం పోయింది. తమ పొలంలో వేసిన పత్తి ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా జాలుబారిపోయింది. దీంతో ఆర్థిక కష్టాలు వైపు, మరోవైపు, కుటుంబాన్ని ఎలా పోషించాలో తెలియక ఆ ఉపాధ్యాయుడు పత్తి చేనులోనే పురుగుల మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ విషాదకర సంఘటన నల్గొండ జిల్లా మునుగోడు మండలం, గంగోరిగూడెంలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, గ్రామానికి చెందిన మర్రి వెంకట్‌ (30) అనే వ్యక్తి పీజీ చేసినా ఉద్యోగం రాకపోవడంతో నార్కట్‌పల్లిలోని లిటిల్‌ ప్లవర్‌ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్నాడు. కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏడు నెలలుగా పాఠశాలలు ప్రారంభంకాలేదు. దాంతో వేతనాలు రాక కుటుంబాన్ని పోషించుకోవడం భారంగా మారింది. 
 
కరోనాతో ఉన్న ఉద్యోగం కోల్పోవడంతో తన గ్రామంలోనే నాలుగెకరాల భూమి కౌలుకు తీసుకుని పత్తి పంట సాగు చేశాడు. ఈ నెలలో కురిసిన అకాల వర్షాలతో పంటంతా జాలుబారింది. దాంతో ఆశించిన మేరకు దిగుబడి వచ్చేటట్టు కన్పించలేదు. పైగా పంటసాగు కోసం చేసిన సుమారు రూ.3 లక్షల అప్పులు ఎలా తీర్చాలో, కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక మనోవేదనకు గురయ్యాడు. 
 
ఈ క్రమంలో ఆదివారం తెల్లవారుజామున పత్తి చేను వద్ద పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు, కుటుంబ సభ్యులు చేను వద్దకు వెళ్లి చూసేసరికి మృతి చెందాడు. మృతుని తండ్రి శంకరయ్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

తెలుగు ప్రముఖ నటుడు రఘునాథ రెడ్డి ఇకలేరు

మెగా ఫ్యామిలీకి వారసుడొచ్చాడు.. తల్లీబిడ్డా ఆరోగ్యంగా ఉన్నారు : చిరంజీవి

మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. రామ్ చరణ్, ఉపాసన దంపతులకు కవల పిల్లలు పుట్టారోచ్

ఫంకీ లో రట్టాటటావ్ గీతంలో విశ్వక్ సేన్, కయాదు లోహర్‌ కెమిస్ట్రీ వన్నెతెచ్చింది

NagAswin: నాగ్ అశ్విన్, సింగీతం శ్రీనివాసరావు, దేవి శ్రీ ప్రసాద్ కాంబినేషన్ చిత్రం షురూ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కంటి చూపుకు ముప్పుగా స్టెరాయిడ్ల వాడకం, సెకండరీ గ్లాకోమాకు దారితీసే ప్రమాదం

హైదరాబాదులో PMJ Jewels హాఫ్ శారీస్, పెళ్లి వేడుకల నగల డిజైన్ల ప్రదర్శన

winter health, గోరువెచ్చని నీటిలో చిటికెడు పసుపు వేసి తాగితే?

ఫ్యూజీఫిల్మ్ ఇండియా సరికొత్త సాంకేతికత అధునాతన ఇమేజింగ్, హెల్త్‌కేర్ ఐటి పరిష్కారాల ఆవిష్కరణ

హైదరాబాద్‌ ఐఆర్‌ఐఏ 2026లో బీపీఎల్ మెడికల్ టెక్నాలజీస్ అధునాతన ఇమేజింగ్, ఏఐ సామర్థ్యాల ప్రదర్శన

తర్వాతి కథనం
Show comments