Webdunia - Bharat's app for daily news and videos

Install App

బైక్ దొంగలించారు ప్రభో అంటే.. ఫైన్ కట్టమంటున్న పోలీసులు

Webdunia
శుక్రవారం, 14 జూన్ 2019 (12:50 IST)
పోలీసుల నిర్లక్ష్యం ఓ వాహనదారుడి పాలిట శాపంగా మారింది. బైక్ చోరీకి గురైందని రికవరీ చేయాలని ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదు. చోరీకి గురైన ఆ బైక్ నగరంలో యధేచ్చగా రోడ్లపై తిరుగుతుంటే.. వాటి ఫొటోలు తీసి బాధితుడికి ఇ-చలాన్లు పంపారు. పోలీసుల తీరుపై ఆక్రోశం వ్యక్తం చేస్తున్నాడు బాధితుడు. 
 
హైదరాబాద్ కుషాయిగూడ నేతాజీనగర్‌కు చెందిన శేషాద్రి తమ ఇంటి ముందు పార్క్ చేసిన మోటారు సైకిల్ చోరీకి గురైనట్టు గతేడాది జనవరిలో కుషాయిగూడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బైక్ చోరీకి గురైన ఘటనపై కేసు బుక్ చేసిన పోలీసులు మాత్రం రికవరీ చేయడాన్ని మరిచారు. అపహరణకు గురైన ఆ బైక్ పైన దొంగలు యధేచ్చగా నగర రోడ్లపై తిరుగుతున్నా.. పోలీసులు ఎక్కడా ఆపలేదని.. హెల్మెట్ ధరించకుండా బైక్ డ్రైవ్ చేస్తున్నారంటూ పోలీసులు శేషాద్రికి ఇ-చలాన్లు పంపారు. 
 
బైక్‌ను రికవరీ చేయకుండా.. రోడ్లపై తనిఖీల్లో కూడా బైక్‌ను పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని వాపోతున్నాడు బాధితుడు. ఇ-చలాన్లు అన్నీ హెల్మెట్ ధరించలేదంటూ పంపారంటూ సోషల్ మీడియాలో శేషాద్రి పోస్ట్ చేశాడు. చలాన్లు పంపే శ్రద్ద బైక్ రికవరీ చేయడంలో పోలీసులు కనబరిస్తే బాగుంటుందంటున్నాడు బాధితుడు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎపుడు కూడా పుకార్లను నమ్మొద్దు.. పవన్ హీరోయిన్ వినతి

Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్ హరిహరవీరమల్లు కు మద్దతు ఇవ్వరా ?

యోగేష్, సన్నీ లియోన్ ప్రధాన పాత్రల్లో థ్రిల్లర్ చిత్రం త్రిముఖ పోస్టర్

ఇండస్ట్రీ కి రావడమే ఓ కలగా వుంది - ఇకపై నటిగా కూడా కొనసాగుతా : జెనీలియా

అన్ని జాగ్రత్తలు తీసుకున్నా.. జరగరాని నష్టం జరిగిపోయింది.. పా.రంజిత్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

చెడు కొవ్వు తగ్గించే పానీయాలు ఏమిటి?

సంక్లిష్టమైన ప్రోస్టేట్ క్యాన్సర్‌తో బాధపడుతున్న రోగిని కాపాడిన సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్‌లోని ఏఓఐ

తర్వాతి కథనం
Show comments