Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీఎం-కేర్స్ నిధికి విరాళంగా కోటిరూపాయలు, ఒకనెల వేతనం

Webdunia
గురువారం, 2 ఏప్రియల్ 2020 (23:02 IST)
దేశవ్యాప్తంగా “లాక్‌డౌన్” నేపథ్యంలో పునరావాస కార్యక్రమాల కోసం ఉద్దేశించిన “పీఎం-కేర్స్ ప్రత్యేక నిధి”కి ఎంపీల్యాడ్స్ నుంచి కోటి రూపాయలతోపాటు, తన ఒకనెల వేతనాన్ని విరాళంగా ఇస్తున్నట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రకటించారు.
 
2020-21 సంవత్సరానికి “ఎంపీ ల్యాడ్స్” నిధులనుంచి ఆ కోటి రూపాయలను కేటాయిస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతోపాటుగా తెలంగాణ రాష్ట్ర “ముఖ్యమంత్రి సహాయ నిధి”కి రూ.50 లక్షలు, తన పార్లమెంటరీ నియోజకవర్గమైన సికింద్రాబాద్‌లో “కరోనా” సహాయ కార్యక్రమాల కోసం మరో రూ.50లక్షలను కూడా ఇస్తున్నట్లు తెలిపారు.
 
దీనికి సంబంధించిన లేఖలను ఎం‌పి లాడ్స్ కమిటీ ఛైర్మన్, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, హైదరాబాద్ కలెక్టర్‌లకు పంపించారు. ప్రస్తుతం దేశం విపత్కర పరిస్థితులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు కూడా తమకు తోచినంత మొత్తాన్ని “పీఎం-కేర్స్ నిధి”కి విరాళాల రూపంలో అందజేయాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి విజ్ఞప్తి చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

భర్తను పరిచయం చేసిన నటి అభినయ!!

కసికా కపూర్... చాలా కసి కసిగా వుంది: బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి (video)

Prabhas: వ్యాపారవేత్త కుమార్తెతో ప్రభాస్ పెళ్లి.. ఎంతవరకు నిజం?

కథలకు, కొత్త టాలెంట్ ని కోసమే కథాసుధ గొప్ప వేదిక: కే రాఘవేంద్రరావు

Film Chamber: జర్నలిస్టులపై ఆంక్షలు పెట్టేదెవరు? నియంత్రించేదెవరు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

సాంబారులో వున్న పోషకాలు ఏమిటి?

30 ఏళ్లు పైబడిన మహిళలు తప్పనిసరిగా తినవలసిన పండ్లు

తర్వాతి కథనం
Show comments