Webdunia - Bharat's app for daily news and videos

Install App

చర్చిలో పెళ్లి.. వరుడు మోసం చేశాడని ఓ యువతి పెళ్లిని ఆపేసింది..

Webdunia
బుధవారం, 11 నవంబరు 2020 (20:52 IST)
ప్రస్తుతం పెళ్లిళ్లు పీటలవరకు వచ్చి ఆగిపోవడం ఫ్యాషనైపోయింది. మొన్నటికి మొన్న తాళికట్టే సమయంలో ఓ వధువు ప్రియుడొస్తున్నాడని.. అతనితో తన పెళ్లి జరగాలంటూ పట్టుబట్టి పెళ్లి ఆపేసింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌లో కూడా ఓ సంఘటన చర్చిలో జరగాల్సిన పెళ్లిని ఆగిపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో పెళ్లి జరుగుతోంది. ఇరు కుటుంబ సభ్యులంతా వివాహానికి హాజరయ్యారు. 
 
జనగామ జిల్లాకు చెందిన అనిల్‌తో హైదరాబాద్ తుకారాంగేట్‌కు చెందిన యువతితో చర్చ్ ఫాదర్లు వివాహం జరిపిస్తున్నారు. ఇంతలో ఓ యువతి అక్కడ ప్రత్యక్షమై.. అనిల్‌ తనను ప్రేమించి మోసం చేశాడంటూ పెళ్లిని అడ్డుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు చర్చ్ బిల్డింగ్ దగ్గరకు చేరుకుని యువతిని ప్రశ్నించారు. పెళ్లి ఆపిన యువతి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో పోలీసులు తిప్పి పంపేశారు.
 
మరోవైపు పెళ్లి చేసుకోబోతున్న తుకారాంగేట్‌కు చెందిన వధువు కూడా మైనర్ కావడంతో చైల్డ్‌లైన్ కో ఆర్డినేటర్ పెళ్లిని ఆపేశారు. అనంతరం మోండా మార్కెట్‌ పోలీస్ స్టేషన్‌లో చైల్డ్‌లైన్, ఐసీడీఎస్‌ అధికారులు ఫిర్యాదు చేశారు. దీంతో పెళ్లికి వచ్చిన వారంతా చేసేదేమీలేక ఎవరి ఇళ్లకు వారు వెనుదిరిగారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

CM: కృష్ణ గారి జయంతినాడు గుర్తుచేసుకున్న చంద్రబాబు

Gaddar Awards: తెలంగాణ గద్దర్ అవార్డులు-మొత్తానికి పప్పు బెల్లాలు పంచిపెట్టారు..

Nagababu: నిహారిక కొణిదెల తొలి చిత్రానికి గద్దర్ అవార్డ్.. నాగబాబు హర్షం

Srileela: వధువులా దుస్తులు ధరించిన శ్రీలీల.. బుగ్గలకు పసుపు రాసుకుంది.. పెళ్లి ఖాయమా?

Surya: కాలిఫోర్నియాలో దియా పట్టా కోసం కనిపించిన న్యూ లుక్ తో సూర్య

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

అకికి లండన్‌ను ప్రారంభించినట్లు వెల్లడించిన బాగ్‌జోన్ లైఫ్‌స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్

రుతుక్రమ నొప్పులకు నిమ్మరసంతో చెక్ పెట్టొచ్చా?

తర్వాతి కథనం
Show comments