Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్?

Webdunia
మంగళవారం, 12 మే 2020 (20:39 IST)
ఖైరతాబాద్ గణేషుడికి లాక్ డౌన్ ఎఫెక్ట్ తగిలింది. ఈసారి ఆయన విశ్వరూప దర్శనం అనుమానంగానే వుంది. తెలుగు రాష్ట్రాల్లో ఖైరతాబాద్ గణేశ్‌కు ప్రత్యేక స్థానం ఉన్న విషయం తెలిసిందే.

రూపంలో ఏటికేడు కొత్తదనం సంతరించుకుంటూ కనువిందు చేసే ఈ భారీ గణేశుడిని చూడటానికి పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తుంటారు. అయితే కరోనా వైరస్ నేపథ్యంలో ఉత్సవ కమిటీ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఏడాది ఒక్క అడుగు ఎత్తులోనే గణేషుడి విగ్రహం ఉండనుందని సమాచారం.

ఈ ఏడాది ఆగస్ట్ 22న వినాయక చవితి వస్తున్న విషయం తెలిసిందే. గణేశ్ తయారీలో తొలి ఘట్టమైన కర్రపూజను మే 18న సాయంత్రం 5 గంటలకు జరపనున్నారు. అదే రోజు గణేశుడిపై ప్రకటన చేయనున్నట్టు ఉత్సవ కమిటీ చైర్మన్ సింగరి సుదర్శన్ తెలిపారు. గతేడాది గణేశుడు 61 అడుగుల ఎత్తులో ఏర్పాటైన విషయం తెలిసిందే.

ద్వాదశ ఆదిత్య మహాగణపతిగా దర్శన మిచ్చాడు. 1954 నుంచి గణేశుడు ఒక్కో అడుగు పెరుగుకుంటూ వస్తున్నాడు. కోటి రూపాయలతో రూపుదిద్దుకున్న గణేశుడి కోసం 100 మందికి పైగా కళాకారులు నాలుగు నెలలు కష్టపడి తయారు చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Shruti Haasan: కూలీలో అందరూ రిలేట్ అయ్యే చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ చేశాను- శ్రుతి హసన్

Spirit: స్పిరిట్ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ నుంచి ప్రారంభం

Tamannaah: విజయ్ వర్మ వల్ల బాగా బరువు పెరిగిన తమన్నా.. ఇప్పుడు ఏం చేస్తోందో తెలుసా?

Sreeleela: గుంటూరు కారం తగ్గినా.. ఆషికి 3తో శ్రీలీలకు బాలీవుడ్‌లో మస్తు ఆఫర్లు?

Vishwambhara: చిరంజీవి, మౌని రాయ్‌పై స్పెషల్ సాంగ్.. విశ్వంభర షూటింగ్ ఓవర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

4 అలవాట్లు వుంటే వెన్నునొప్పి వదలదట, ఏంటవి?

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

తర్వాతి కథనం
Show comments