Webdunia - Bharat's app for daily news and videos

Install App

లాక్డౌన్.. మహిళలపై పెరుగుతున్న గృహహింస కేసులు..

Webdunia
శుక్రవారం, 28 మే 2021 (16:06 IST)
సాధారణ రోజుల్లోనే మహిళలపై అకృత్యాలు, అఘాయిత్యాలు, పెచ్చరిల్లిపోతున్నాయి. దీనికి తోడు లాక్డౌన్ కూడా కావడంతో.. మహిళలపై గృహహింస కేసులు పెరుగుతున్నాయని హైదరాబాద్ అదనపు డీజీ స్వాతి లక్రా తెలిపారు. లాక్డౌన్ కారణంగా అందరూ ఇళ్లల్లో ఉండటంతో మహిళలపై పనిభారం పెరుగుతోంది.

బయటకెళ్లే పరిస్థితి లేక.. పనిలేక.. మగవారు ఒత్తిడికి గురికావటం.. అదంతా ఇంట్లో ఆడవాళ్ల మీద చూపించటం.. పిల్లలు కూడా స్కూల్స్, కాలేజీలు లేక ఇంట్లోనే ఉండటంతో పనిభారం పెరుగుతోంది. ఇంటిపని, కుటుంబ సభ్యులకు తగినట్లు నడుచుకుంటూ ఉద్యోగినులు అయితే వర్క్ ఫ్రమ్ హోమ్‌తో సతమతమవుతున్నారని తెలిపారు.
 
కరోనా సెకండ్ వేవ్ లాక్ డౌన్‌లో కేవలం 13 రోజుల్లోనే గృహహింసకు గురైన బాధితులు తమకు ఫోన్ చేస్తున్నారని.. డయల్ 100కు ఎక్కువ ఫోన్ కాల్స్ వచ్చాయని తెలిపారు. గృహహింసకు గురవుతున్నావారు ఏమాత్రం భయపడకుండా ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలని డీజీ స్వాతి లక్రాసూచించారు.

ఈ లాక్ డౌన్ సమయంలో కూడా షీ టీమ్స్ పనిచేస్తున్నాయని..లాక్ డౌన్ అమలులో ఉంది కాబట్టి మహిళలు బయటకు రాకుండా వెంటనే 100కు ఫోన్ చేయవచ్చునని.. లేదా షీ టీమ్స్ కూడా తెలియజేయవచ్చునని స్వాతి లక్రా తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Maargan movie review: విజయ్ ఆంటోనీ మార్గ‌న్ రివ్యూ.. రేటింగ్ ఎంతంటే?

సెన్సార్ పూర్తి చేసుకున్న సోషియోఫాంటసీగా దీర్ఘాయుష్మాన్ భవ

సూర్య సేతుపతి హీరోగా పరిచయమవుతున్న మూవీ ఫీనిక్స్

కీర్తి సురేష్, సుహాస్ ఉప్పు కప్పురంబు మ్యూజిక్ ఆల్బమ్

SJ Surya: ఎస్‌జె సూర్య దర్శకత్వంలో శ్రీ గొకులం మూవీస్‌ టైటిల్ కిల్లర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

గ్రీన్ టీ అతిగా తాగుతున్నారా?

ఫ్యాబ్ ఇండియా బ్యూటిఫుల్ ఇంపెర్ఫెక్షన్ ప్రచారం హస్తకళల ఆకర్షణ

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

తర్వాతి కథనం
Show comments