Webdunia - Bharat's app for daily news and videos

Install App

అంబులెన్స్‌లో సజీవదహనమైన 15 గోవులు

Webdunia
ఆదివారం, 1 మే 2022 (12:53 IST)
నిజామాబాద్ జిల్లా జాతీయ రహదారిలో ఒక అంబులెన్స్ ఎమర్జెన్సీ అని స్టిక్కర్ అని అతికించుకున్న వాహనంలో మంటలు చెలరేగి, అందులో ఉన్న 15 ఆవులు సజీవదహనమయ్యాయి. ఈ దారుణం జిల్లాలోని ఇందల్వాయి పరిధిలోని మాక్లూర్ తండా శివారు జాతీయ రహదారిపై జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఒక వాహనానికి అంబులెన్స్‌ అంటూ స్టిక్కర్‌ అంటించుకున్నారు. ఈ వాహనం ఇంజిన్‌లోని మంటలు చెలరేగాయి. దీన్ని గమనించిన డ్రైవర్‌ వాహనాన్ని రోడ్డు పక్కన ఆపేసి పరారయ్యాడు. వెనుక వస్తున్న వాహనదారులు మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. 
 
ఆ తర్వాత పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వాహనం డోర్‌ను తీసేందుకు ప్రయత్నించగా తెరుచుకోలేదు. దీంతో అందులో ఉన్న 15 ఆవులు మంటల్లో కాలిపోయాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments