Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

హైదరాబాద్‌లోని బొత్స ఇంటికి 15 నెలలుగా విద్యుత్ బిల్లు బకాయిలు...

botsa
, ఆదివారం, 1 మే 2022 (10:46 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖామంత్రిగా ఉన్న బొత్స సత్యనారాయణకు హైదరాబాద్ నగరంలోనూ ఓ సొంతిల్లు వుంది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈయన తన మకాంను విజయవాడ నగరానికి మార్చారు. పైగా, ఏపీ మంత్రిగా ఉండటంతో ఆయన విజయవాడ, విజయనగరంలలో అధికంగా ఉంటున్నారు. దీంతో హైరాబాద్ నగరంలోని నివాసంలో ఎవరూ లేరన్నది సమాచారం. 
 
ఈ కారణంగ గత యేడాదిన్నర కాలంగా ఇంటికి విద్యుత్ బిల్లు చెల్లించలేదనే ప్రచారం సామాజిక మాద్యమం వేదికగా సాగుతోంది. ముఖ్యంగా, ఇంటికి 15 నెలలుగా బిల్లు చెల్లించకపోవడం వల్లే విద్యుత్ సరఫరాను నిలిపివేసినట్టు డిస్కం తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నట్టుగా ట్వీట్ ఒకటి చక్కర్లు కొడుతోంది. 
 
దీనిపై తెలగాణ విద్యుత్ పంపిణీ వ్యవస్థ (డిస్కిం) సీఎండీ రఘుమా రెడ్డి స్పందించారు. అది బోగస్ ట్వీట్ అని స్పష్టం చేసింది. మంత్రికి సంబంధించిన ఎలాంటి సమాచారాన్ని డిస్కం తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో షేర్ చేయలేదని వివరణ ఇచ్చారు. పైగా, తమ సంస్థ పేరుతో ఇలాంటి దుష్ప్రచారం చేసేవారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సీఎం జగన్ సర్కారుకు వ్యతిరేకంగా విశ్వాస ఘాతుక దీక్షలు