కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌కు తప్పిన పెను ముప్పు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (12:18 IST)
ముంబై నుంచి భువనేశ్వర్ వెళుతున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌ రైలుకు పెను ముప్పు తప్పింది. రైలులో ఒక్కసారిగా పొగలు వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు అత్యవసరంగా చైన్ లాగి రైలును ఆపేశారు. 
 
రైలులోని ఏసీ బోగీలో పొగలు రావడంతో రైలును డోర్నకల్ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌లో నిలిపివేశారు. సమాచారం అందుకున్న రైల్వే అధికారులు వెంటనే డోర్నకల్ జంక్షన్‌ రైల్వేస్టేషన్‌కు చేరుకొని మరమ్మతు చర్యలు చేపట్టారు. 
 
పొగలు వ్యాపించిన బోగీని వేరు చేసి ప్రయాణికులను మరో బోగీలోకి తరలించారు. ఈ ఘటన వల్ల ప్రయాణికులెవరూ ఇబ్బంది పడలేదని అందరూ సురక్షితంగా ఉన్నారని రైల్వే అధికారులు వెల్లడించారు. 
 
ఏసీ బోగీలో పొగలు రావడానికి గల కారణాలపై అధికారులు విచారణ చేస్తున్నారు. సాంకేతిక కారణాల వల్ల జరిగిందా లేదా ఇతర కారణాలా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. బ్రేకులు జామ్ అయివుండొచ్చని అధికారులు భావిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments