Webdunia - Bharat's app for daily news and videos

Install App

అగ్నిపథ్‌కు దరఖాస్తుల వెల్లువ - వాయుసేనకు ఇప్పటికే 60 వేలు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:53 IST)
త్రివిధ దళాల్లో సైనిక బలగాల నియామకం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అగ్నిపథ్ పథకానికి వ్యతిరేకంగా ఆరంభంలో అనేక నిరసన కార్యక్రమాలు ఆందోళనలు జరిగాయి. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ హింసాకాండ తర్వాత ఈ ఆందోళనపై కేంద్రం ఉక్కుపాదం మోపింది. దీంతో అవి ఆగిపోయాయి. 
 
అదేసమయంలో నాలుగేళ్ళ పాటు సైన్యంలో సేవలు అందించేందుకు దేశ యువత అమిత ఉత్సాహం చూపుతోంది.  ఇందులోభాగంగా, ఈ అగ్నిపథ్ పథకంలో భాగంగా వాయుసేనలో నియామకాల కోసం శుక్రవారం నోటిఫికేషన్ జారీ అయింది. దీనికి మూడు రోజుల్లోనే ఏకంగా 59960 దరఖాస్తులు వచ్చాయి. దరఖాస్తు ప్రక్రియ వచ్చే నెల ఐదో తేదీతో ముగియనుంది. 
 
అప్పటికి లక్ష దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. వాయుసేనలో అగ్నివీర్ తొలి బ్యాచ్‌ను డిసెంబరు 11వ తేదీన ప్రకటించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ యేడాది మాత్రం 23 యేళ్ల వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. agnipathvayu.cdac.in అనే వెబ్‌సైట్ ద్వారా అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments