Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:23 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, సోమవారం నమోదైన కేసుల్లో ఏకంగా 45 శాతం పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 94 వేలకు ఎగబాకింది. 
 
దేశ వ్యాప్తంగా మొత్తం 3.03 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా ఢిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి. 
 
తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా 4.27 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లక్ష్మీ నరసింహా రీరిలీజ్ లో కొత్తగా యాడ్ చేసిన మందేసినోడు సాంగ్

దైవిక శక్తిని కోరుతూ పళని మురుగన్ ఆలయాన్ని సందర్శించిన సూర్య టీమ్

ప్రతి తల్లి తన దృష్టిలో ఓ కన్నప్ప : మోహన్ బాబు

భైరవం చిత్రం నిర్మాతకు నష్టం - హీరోలకు అంతేనా ?

Sidhu : సిద్ధు జొన్నలగడ్డ రూ.4 కోట్లు తిరిగి ఇచ్చాడా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

తర్వాతి కథనం
Show comments