Webdunia - Bharat's app for daily news and videos

Install App

దేశంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగిన కోవిడ్ కేసులు

Webdunia
సోమవారం, 27 జూన్ 2022 (11:23 IST)
దేశ వ్యాప్తంగా కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరిగాయి. గత రెండు రోజులుగా ఈ కేసుల సంఖ్య తగ్గుతూ వచ్చింది. కానీ, సోమవారం నమోదైన కేసుల్లో ఏకంగా 45 శాతం పెరుగుదల కనిపించింది. గత 24 గంటల్లో ఏకంగా 17 వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో క్రియాశీల కేసుల సంఖ్య 94 వేలకు ఎగబాకింది. 
 
దేశ వ్యాప్తంగా మొత్తం 3.03 లక్షల మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలు చేశారు. వీరిలో 17,073 మందికి వైరస్ సోకిందని సోమవారం కేంద్రం వెల్లడించింది. దాంతో పాజిటివిటీ రేటు 5 శాతానికి చేరి, ఆందోళన కలిగిస్తోంది. మహారాష్ట్ర, కేరళలో కలిపి మొత్తం దాదాపు 10 వేల కేసులొచ్చాయి. తమిళనాడులో వెయ్యి దాటగా ఢిల్లీలో రెండువేలకు చేరువయ్యాయి. 
 
తాజాగా వైరస్ విస్తరిస్తుండటంతో క్రియాశీల కేసులు 94,420కి చేరాయి. క్రియాశీల కేసుల రేటు 0.22 శాతానికి పెరగ్గా.. రికవరీ రేటు 98.57 శాతానికి పడిపోయింది. గత 24 గంటల్లో 15,208 మంది కోలుకున్నారు. 21 మంది మరణించారు. ఇప్పటివరకూ 4.34 కోట్ల మందికిపైగా కరోనా బారినపడగా 4.27 కోట్ల మందికిపైగా కోలుకున్నారు. 5.25 లక్షల మందికి పైగా మరణించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వై.ఎస్. గురించి మీకు ముందే తెలుసా ! అని అడిగారు : దర్శకుడు శశికిరణ్‌ తిక్క

ఓ రేంజ్‌లో సాగుతున్న 'వీరమల్లు' రికార్డులు... పాత రికార్డులు గల్లంతేనా?

Hansika: నటి హన్సిక మోత్వానీ విడాకులకు సిద్ధమైందా..?

Tanushree Dutta: నన్ను వేధిస్తున్నారు, కాపాడండి, తనుశ్రీ కన్నీటి పర్యంతం (video)

Rasi: ప్రేయసిరావే లో శ్రీకాంత్‌ని కొట్టాను, హిట్‌ అయ్యింది, ఉసురే కూడా అవుతుంది : హీరోయిన్‌ రాశి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఒక్క ఏలుక్కాయను రాత్రి తిని చూడండి

Monsoon: వర్షాకాలం.. గ్లాసుడు గోరువెచ్చని నీరు బెస్ట్.. సలాడ్స్, చల్లని పానీయాలు వద్దు

అంజీర్ పండ్లు ఆరోగ్య ప్రయోజనాలు

వాన చినుకులతో వచ్చేసాయ్ మొక్కజొన్న పొత్తులు, ఇవి తింటే?

జ్ఞాపక శక్తిని పెంచే ఆహార పదార్థాలు

తర్వాతి కథనం
Show comments