Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

నేడు రేపు తెలంగాణాలో ఓ మోస్తరు వర్షాలు

Rains
, సోమవారం, 27 జూన్ 2022 (08:33 IST)
నైరుతి రుతుపవనాల ప్రభావం కారణంగా నేడు, రేపు తెలంగాణాలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తారు వర్షాలు పడనున్నాయి. మధ్యప్రదేశ్, నుంచి ఛత్తీస్‌గఢ్‌, ఒడిశాల మీదుగా బంగాళాఖాతం వరకు 1500 మీటర్ల ఎత్తున గాలులతో ఉపరితలద్రోణి ఏర్పడివుంది. దీనికితోడు ఒడిశాపై గాలులతో ఉపరితల ఆవర్తనం 3.1 కిలోమీటర్ల ఎత్తున ఉంది.
 
వీటిన్నింటి ప్రభావం కారణంగా సోమ, మంగళవారాల్లో రాష్ట్రంలో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైరాబాద్ వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణలో రుతుపవనాల కదలికలు సాధారణంగా ఉన్నాయని పేర్కొంది. 
 
కాగా, ఆదివారం పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. అత్యధికంగా నిజాంబాద్‌(రాజన్న జిల్లా)లో 4.6, కోహెడ(సిద్దిపేట)లో 4, మల్యాల(కరీంనగర్‌)లో 4, టేక్మాలు(మెదక్‌)లో 4, అశ్వాపురం(భద్రాద్రి)లో 3.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జూలై 5 నుంచి ఏపీలో స్కూల్స్ పునఃప్రారంభం - ఏప్రిల్‌ 29 చివరి పనిదినం