Webdunia - Bharat's app for daily news and videos

Install App

అప్పటికే పెళ్లయింది.. అయినా ఆ అమ్మాయిపై మనసుపడ్డాడు.. చివరకు...

Webdunia
శుక్రవారం, 12 మార్చి 2021 (09:14 IST)
ఖమ్మం జిల్లా కేంద్రంలో ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. తనను ప్రేమ పేరుతో ఓ వివాహితుడు మోసం చేయడాన్ని జీర్ణించుకోలేని ఆ యువతి ఈ అఘాయిత్యానికి పాల్పడింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఖమ్మం జిల్లాలలోని మాలబంజరకు చెందిన డిగ్రీ విద్యార్థిని తంబల్ల రత్నకుమారి(24) అనే యువతి ఖమ్మంలోని ఓ షాపింగ్‌ మాల్‌లో సహాయకురాలిగా చేస్తూ వచ్చింది. 
 
ఆ సమయంలో నగరానికి చెందిన ఆటో డ్రైవర్‌ కర్రి సంజయ్‌తో ఆమెకు పరిచయం ఏర్పడింది. అదికాస్తా వారిద్దరి మధ్య ప్రేమగా మారింది. కానీ అతనికి అప్పటికే పెళ్లయింది. ఈ విషయాన్ని రత్నకుమారికి సంజయ్ చెప్పలేదు. పైగా, యువతి అందంగా ఉండటంతో సంజయ్ కూడా పీకల్లోతు ప్రేమలో మునిగిపోయాడు. 
 
ఇంతలో కొత్తగూడెంలో ఉంటున్న సొంత బావమరిది కర్ణ ప్రకాశ్‌ వచ్చి రత్నకుమారిని మందలించాడు. ఇప్పటికే పెళ్లయిన తన బావతో సన్నిహితంగా ఎందుకు ఉంటున్నావని బెదిరించాడు. అసలు విషయం తెలిసి మనస్తాపం చెందిన రత్నకుమారి ఈ నెల 8న స్వగ్రామానికి వచ్చింది. 
 
మంగళవారం పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఇది గమనించిన కుటుంబసభ్యులు కొత్తగూడెం, అక్కడ్నుంచి మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించారు. ఆమె అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతిచెందింది. మృతురాలి బాబాయి ఫిర్యాదుతో సంజయ్‌, అతని బావమరిది ప్రకాశ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి కల్లు ఆరోగ్య ప్రయోజనాలు

Night shifts: నైట్ షిఫ్ట్ చేస్తున్న మహిళలకు ఆస్తమా వచ్చే ప్రమాదం ఎక్కువ

ఉదయాన్నే గోరువెచ్చని మంచినీటిని తాగితే?

జామ ఆకుల టీ తాగితే?

ఇది షాకింగ్ వార్తే.. ఆల్కహాల్‌ కాలేయ వ్యాధులు.. మృతుల్లో మహిళలే ఎక్కువ

తర్వాతి కథనం
Show comments