Webdunia - Bharat's app for daily news and videos

Install App

కేసీఆర్‌పై ఫైర్ అయిన కేఏపాల్... మహిళలను రాష్ట్రపతి ఎంపికపై హర్షం

Webdunia
బుధవారం, 22 జూన్ 2022 (20:55 IST)
ముఖ్యమంత్రి కేసీఆర్‌పై కేఏపాల్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ కుటుంబం చేస్తున్న అవినీతిపై సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌‌కు ఫిర్యాదు చేసినట్లు పాల్ చెప్పారు. 
 
ఢిల్లీలోని సీబీఐ డైరెక్టర్‌తో సమావేశం అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ చేస్తున్న అవినీతిపై ఇంతవరకు ఎవరూ సరైన రీతిలో ఫిర్యాదు ఇవ్వలేదని, అందువల్లే సీబీఐ వారిపై చర్యలు తీసుకోలేకపోతోందన్నారు. 
 
యాదగిరిగిగుట్ట నిర్మాణం విషయంలో అవినీతి చోటుచేసుకుందని సీబీఐకి ఫిర్యాదు చేసినట్లు పాల్​ తెలిపారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో రూ.లక్షా ఐదు వేలకోట్ల అవినీతి జరిగిందని ఫిర్యాదులో తెలిపినట్లు వివరించారు పాల్​. 
 
ఇక గతంలో తనపై జరిగిన దాడి విషయంలో ఇంకా ఎందుకు అరెస్టులు జరగలేదని ప్రశ్నించానని పాల్ అన్నారు. అలాగే రాష్ట్రపతి అభ్యర్థిగా గిరిజన మహిళను ప్రకటించడం సంతోషకరమని పాల్​ అన్నారు. 
 
తాను మొదటి నుండి షెడ్యూల్డ్ కులాలకు చెందిన మహిళలకు రాష్ట్రపతి పదవి ఇవ్వాలని బీజేపీకి చెప్పానన్నారు. వెంకయ్య నాయుడిని రాష్ట్రపతిగా వద్దని ఇదివరకే సూచించానని కేఏ పాల్ చెప్పడం కొసమెరుపు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Vishal: పందెం కోడి హీరో విశాల్ పెళ్లి వాయిదా పడిందా? కారణం ఏంటంటే?

అమ్మాయి ప్రధాన పాత్రలో నటించిన చిత్రం రిలీజ్‌కు ఎన్ని కష్టాలు : అనుపమ పరమేశ్వరన్

పరదా లాంటి సినిమా తీయడం అంత ఈజీ కాదు : డి. సురేష్ బాబు

Prabhas: కట్టప్ప బాహుబలిని చంపకపోతే? ఎవరు చంపేవారో తెలుసా !

Nidhi: వంద సినిమాలు చేసినా, పవన్ కళ్యాణ్ తో ఒక్క సినిమా ఒకటే : నిధి అగర్వాల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తులసిని నీటిలో మరిగించి ఆ కషాయాన్ని తాగితే?

వర్షాకాలంలో ఆయుర్వేద ఆహారం: మెరిసే చర్మాన్ని పొందడానికి నిపుణుల చిట్కాలు

స్లిమ్‌గా వున్నవారు లావయ్యేందుకు ఏం తినాలి?

ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఓ సవాలుగా మారింది, అందుకే

చేదుగా వుందని కాకరను వదలకండి.. బరువు తగ్గేందుకు డైట్‌లో చేర్చితే?

తర్వాతి కథనం
Show comments