Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలంగాణాలో ఆలస్యంకానున్న ఇంటర్ పరీక్షా ఫలితాలు

Advertiesment
Telangana
రెండు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షా ఫలితాలు వెల్లడయ్యాయి. త్వరలోనే ఇంటర్ ఫలితాలు విడుదల కానున్నాయి. కానీ, తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ ఫలితాల వెల్లడిలో జాప్యం కానుంది. నిజానికి ఈ నెల ఆరంభంలోనే ఈ ఫలితాలను వెల్లడిస్తారని వార్తలు వచ్చాయి. కానీ, ఇంటర్ బోర్డు మాత్రం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక జూన్ 15వ తేదీన ఈ ఫలితాలను వెల్లడించనున్నారనే వార్తలు వచ్చాయి. 
 
కానీ, ఆ రోజు కూడా గడిచిపోయింది. ఈ పరిస్థితుల్లో ఇంటర్ ఫలితాలు ఎపుడు వెల్లడవుతాయన్న దానిపై ఇప్పటికీ క్లారిటీ లేదు. దీంతో విద్యార్థులు అయోమయానికి గురవుతున్నారు. కనీసం ఈ నెలాఖరైనా ఈ ఫలితాలను విడుదల చేయాలని విద్యార్థులు కోరుతున్నారు. అయితే, తెలంగాణ విద్యా శాఖ అధికారుల వైపు నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అగ్నివీరులకు మహీంద్రా గ్రూపు అవకాశాలు ఇస్తుంది : ఆనంద్ మహీంద్రా