Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవరో తెలియాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి : కేఏ పాల్

Webdunia
ఆదివారం, 1 మే 2022 (17:46 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరో తెలియదంటూ వరంగల్ నగర కమిషన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటరిచ్చారు. తాను ఎవరో తెలియాలంటే గూగుల్ సెర్చ్‌ చేయాలని సూచించారు. 
 
ఈ నెల 6వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు తమ పార్టీ అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ ఆరోపించారు. ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతిచ్చారని ఆయన మండిపడ్డారు. 
 
రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి తమ పార్టీ  సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పైగా, తన సభకు అనుమతి ఇవ్వొద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను సీఎం కేసీఆర్ బెదిరించారని  ఆరోపించారు. 
 
బంగారు తెలంగాణా చేస్తానని చెప్పి, అప్పుల సర్కారు చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతామని కేఏ పాల్ ప్రకటించారు. నిన్నగాక మొన్న రాహుల్ సభకు అనుమతి ఇచ్చి ఇపుడు తనకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. తానెవరో తెలియదంటూ కమిషనర్ అన్నారని, గూగుల్‌లో నా పేరు వెతికితే తాను ఎవరో తెలుస్తుందన్నారు. సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆగే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kalpika Ganesh: నటి కల్పిక మానసిక ఆరోగ్యం క్షీణిస్తోంది.. మందులు వాడట్లేదు: తండ్రి గణేష్ ఫిర్యాదు (video)

OG: పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా నుంచి ఫస్ట్ బ్లాస్ట్ ఇవ్వబోతున్న థమన్

ఊర్వశి రౌతేలాకు షాక్.. లండన్‌లో బ్యాగు చోరీ

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

విడాకులు తీసుకున్న మహిళను పెళ్లాడితే ఎలా వుంటుంది?

కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ, నటి ఆషికా రంగనాథ్‌తో వరమహాలక్ష్మిని జరుపుకోండి

గుండె ఆరోగ్యానికి లేత చింతకాయ పచ్చడి, ఇంకా ఎన్నో ప్రయోజనాలు

Saffron Milk: పిల్లలకు రోజూ కుంకుమ పువ్వు పాలను ఇవ్వవచ్చా?

నార్త్ కరోలినాలో నాట్స్ బాలల సంబరాలు, ఉత్సాహంగా పాల్గొన్న తెలుగు విద్యార్ధులు

తర్వాతి కథనం
Show comments