Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేనెవరో తెలియాలంటే గూగుల్‌లో సెర్చ్ చేయండి : కేఏ పాల్

Webdunia
ఆదివారం, 1 మే 2022 (17:46 IST)
తెలంగాణ రాష్ట్ర పోలీసులపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎవరో తెలియదంటూ వరంగల్ నగర కమిషన్ చేసిన వ్యాఖ్యలకు ఆయన గట్టిగానే కౌంటరిచ్చారు. తాను ఎవరో తెలియాలంటే గూగుల్ సెర్చ్‌ చేయాలని సూచించారు. 
 
ఈ నెల 6వ తేదీన హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో సభ పెట్టుకునేందుకు తమ పార్టీ అనుమతి కోరగా అనుమతి ఇవ్వలేదని కేఏ పాల్ ఆరోపించారు. ఓటు బ్యాంకు లేని రాహుల్ గాంధీకి మాత్రం అనుమతిచ్చారని ఆయన మండిపడ్డారు. 
 
రైతుల కోసం సభ నిర్వహించి ఉద్యమం చేస్తున్నందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ భయపడి తమ పార్టీ  సభకు అనుమతి ఇవ్వలేదని ఆయన ఆరోపించారు. పైగా, తన సభకు అనుమతి ఇవ్వొద్దంటూ హైదరాబాద్, వరంగల్ కమిషనర్లను సీఎం కేసీఆర్ బెదిరించారని  ఆరోపించారు. 
 
బంగారు తెలంగాణా చేస్తానని చెప్పి, అప్పుల సర్కారు చేసిందన్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా రైతులు, నిరుద్యోగులకు అండగా పోరాడుతామని కేఏ పాల్ ప్రకటించారు. నిన్నగాక మొన్న రాహుల్ సభకు అనుమతి ఇచ్చి ఇపుడు తనకు ఎందుకు ఇవ్వరని ఆయన ప్రశ్నించారు. తానెవరో తెలియదంటూ కమిషనర్ అన్నారని, గూగుల్‌లో నా పేరు వెతికితే తాను ఎవరో తెలుస్తుందన్నారు. సభకు అనుమతి ఇచ్చినా ఇవ్వకపోయినా ఆగే ప్రసక్తే లేదని ఆయన తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments