Webdunia - Bharat's app for daily news and videos

Install App

అవినీతి కేసులో సస్పెండ్ అయిన షేక్ పేట తాహసీల్దార్ సుజాత మృతి

Webdunia
ఆదివారం, 4 సెప్టెంబరు 2022 (09:13 IST)
గత 2020లో అవినీతి కేసులో అరెస్టు అయి ఆ తర్వాత బెయిలుపై విడుదలైన తెలంగాణ షేక్‌పేట తాహసీల్దార్ సి.హెచ్.సుజాత (46) అనారోగ్యంతో కన్నుమూశారు. ఆమె బ్లడ్ కేన్సర్‌‍తో చనిపోయారు. గత 2020లో షేక్‌పేట తాహశీల్దారుగా పని చేస్తున్న సమయంలో ఆమెను అక్రమాస్తుల కేసులో అవినీతి నిరోధక శాఖ అధికారులు అరెస్టు చేశారు. 
 
ఏసీబీ సోదాల్లో పెద్ద ఎత్తున నగలు, నగదును స్వాధీనం చేసుకున్నారు. ఈ తర్వాత సుజాతను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తన భార్య అక్రమాస్తుల కేసులో తనను ఏసీబీ విచారణకు పిలవడాన్ని తీవ్ర అవమానంగా భావించిన ఆమె భర్త, ఉస్మానియా విశ్వవిద్యాలయం‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పని చేస్తూ వచ్చిన అజయ్ కుమార్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. 
 
భర్త మరణంతో పాటు అవినీతి కేసులో అరెస్టు, విధుల నుంచి సస్పెన్షన్ వంటివి సుజాతను మానసికంగా కుంగదీశారు. ఈ క్రమంలో ఆమె అనారోగ్యానికి గురైంది. గత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతున్న సుజాతకు బ్లడ్ కేన్సర్ ఉన్నట్టు ఇటీవలే బయటపడింది. దీంతో ఆమె కీమో థెరపీ చేయించుకుంటున్నారు. ఈ క్రమంలో ఆమెకు శనివారం గుండెపోటుకు గురయ్యారు. ఆమెను బతికించేందుకు వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. రక్త కేన్సర్ కారణంగానే ఆమె మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments