హైదరాబాద్ సైబర్ క్రైమ్.. డిపాజిట్ చేస్తేనే ఆదాయం.. ఐదు లక్షలు గోవిందా!

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (12:43 IST)
సైబర్ నేరాలు రోజు రోజుకీ పెరిగిపోతున్నాయి. తాజాగా అబిడ్స్‌కు చెందిన యువతి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మి.. లక్షలు మోసపోయింది. ప్రముఖ బ్రాండ్ల ఉత్పత్తులకు ప్రచారం చేస్తే రోజుకు వెయ్యి సంపాదించవచ్చునని ఆశచూపి.. రెండు వేల రూపాయలను రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు, నెల తర్వాత రూ.28వేల ఆదాయం చూపించారు. ఆ సొమ్ము విత్ డ్రా చేసుకునేందుకు అదనంగా 50వేల రూపాయలను డిపాజిట్ చేయాలన్నారు. 
 
సంపాదన పెరుగుతున్న కొద్దీ డిపాజిట్ పెంచారు. ఇలా ఐదు లక్షల రూపాయలు డిపాజిట్ చేయించుకుని ఖాతా రద్దు చేశారు. ఈ ఘటన తెలంగాణలో చోటుచేసుకుంది. హైదరాబాదు నగరంలో చాలామంది ఇలా మోసపోయారు. బాధితుల్లో విద్యార్థినులు, ఉన్నత విద్యావంతులు, గృహిణులు వున్నారు. 
 
ఆన్ లైన్ వేదికగా ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి. నిరుద్యోగులు సులభంగా ఈ ఉచ్చులో పడుతున్నారు. అయితే సామాజిక మాధ్యమాలు, ఫోన్లకు ఇలాంటి ప్రకటనలు వస్తే నమ్మొద్దని సైబర్ క్రైమ్ అధికారులు హెచ్చరిస్తున్నారు. వాస్తవాలు తెలియకుండా పెట్టుబడి పెట్టవద్దని.. మోసపోతే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచిస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Harish Kalyan: హ‌రీష్ క‌ళ్యాణ్ హీరోగా దాషమకాన్ టైటిల్ ప్రోమో

Ramana Gogula: ఆస్ట్రేలియా టూ అమెరికా..రమణ గోగుల మ్యూజిక్ జాతర

చిరంజీవిని శ్రీనివాస కళ్యాణ మహోత్సవానికి ఆహ్వానించిన వంశీ కృష్ణ

Anaswara Rajan: ఛాంపియన్ నుంచి చంద్రకళగా అనస్వర రాజన్ గ్లింప్స్ రిలీజ్

Bunny Vas: ఐ బొమ్మ రవి సపోర్టర్లపై బన్నీ వాస్ ఎదురుదాడి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కూరల్లో వేసుకునే కరివేపాకును అలా తీసిపడేయకండి, ఎందుకంటే?

Winter Health, హానికరమైన వ్యాధులను దూరం చేసే పసుపు

పోషకాలు తగ్గకుండా వీగన్ డైట్‌కు మారడం ఎలా?

చలికాలంలో ఎలాంటి కూరగాయలు తినాలో తెలుసా?

మైగ్రేన్ నుండి వేగవంతమైన ఉపశమనం కోసం ఓరల్ ఔషధాన్ని ప్రారంభించిన ఫైజర్

తర్వాతి కథనం
Show comments