Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్రేటర్ ఎన్నికలు.. ఓటు వేసేందుకు ఆసక్తి చూపని హైదరాబాదీలు

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:49 IST)
గ్రేటర్ ఎన్నికల్లో భాగంగా హైదరాబాదీలు ఇప్పటి వరకు ఓటు వేసేందుకు ఆసక్తి చూపడంలేదు. ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రక్రియ ప్రారంభం కాగా.. తొలి రెండు గంటల్లో మందకొడిగా పోలింగ్ సాగింది. మొదటి రెండు గంటల్లో కేవలం 4.2 శాతం మాత్రమే పోలింగ్ నమోదు అయ్యింది. 
 
ఎప్పటిలాగే ఇప్పుడు కూడా ఓటింగ్‌కు గ్రేటర్ వాసులు ఆసక్తి చూపడంలేదు. ఇక ఓటు హక్కు వినియోగించుకుంటున్న అధికారులు, ప్రముఖులు.. తప్పనిసరిగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని పిలుపునిస్తున్నారు.
 
గత రెండు ఎన్నికల్లో పోలింగ్ 50 శాతం మించలేదు. ఐదేళ్ల పాటు నగర భవిష్యత్‌ను ఎవరికి అప్పగించాలో నిర్ణయించే ఎన్నికలను ఓటర్లు లైట్ తీసుకుంటున్నారు. ఇంటి నుంచి బయటకు వచ్చి ఓటేసేందుకు ఆసక్తి చూపలేదు. 
 
సాధారణ ఎన్నికల్లో కంటే గ్రేటర్ ఎన్నికల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంటుందంటే.. పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. గత రెండు ఎన్నికల్లో పోలింగ్ జరిగిన తీరు చూస్తే.. ఓటర్ల నిరాశక్తత ఏంటో తెలుస్తుంది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments