Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణలో కరోనా తగ్గుముఖం.. ఒక్క రోజే 502 కేసులు..

Webdunia
మంగళవారం, 1 డిశెంబరు 2020 (10:44 IST)
తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. ఇందులో ముఖ్యంగా తెలంగాణలో కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. గత కొన్ని రోజులుగా వెయ్యికంటే తక్కువ కేసులు నమోదవుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ కరోనా బులెటిన్‌ను రిలీజ్ చేసింది. ఈ బులెటిన్ ప్రకారం కొత్తగా 502 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,78,318కి చేరింది.
 
ఇందులో 2,69,230 మంది కోలుకొని డిశ్చార్జ్ కాగా, 9,627 కేసులు యాక్టివ్ గా ఉన్నాయి. ఇక తెలంగాణలో కరోనాతో ముగ్గురు మరణించారు. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1461కి చేరింది. నిన్న ఒక్కరోజు 894 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇంకా సోమవారం రాత్రి 8 గంటల వరకు రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా 805 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతోపాటు ఈ మహమ్మారి కారణంగా ముగ్గురు (3) మరణించారు. 
 
ఇదిలావుంటే.. సోమవారం తెలంగాణ వ్యాప్తంగా 46,597 కరోనా పరీక్షలు చేశారు. వీటితో కలిపి నవంబరు 30వ తేదీ వరకు మొత్తం 55,00,058 నమూనాలను పరీక్షించినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

ఉదయం ఖాళీ కడుపుతో కాఫీ తాగడం మంచిదా చెడ్డదా?

వేసవిలో సపోటా జ్యూస్ తాగితే?

వేసవిలో మంచినీళ్లు ఇలా తాగితే డీహైడ్రేషన్‌కి దూరం

యూరిక్ యాసిడ్ పెరుగుతోందని తెలుసుకునేది ఎలా?

ఫెర్టిలిటీపై ఫెర్టిలిటీ నిపుణుల ఫెర్టిజ్ఞాన్ సదస్సు

తర్వాతి కథనం
Show comments