Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

టెక్సాస్‌లో విషాదం... ముగ్గురు తెలంగాణ వాసుల మృతి

Advertiesment
Texas
అమెరికాలోని టెక్సాస్‌లో విషాదకర ఘటన జరిగింది. ఇక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణ రాష్ట్రానికి చెందిన తెలుగువారు ప్రాణాలు కోల్పోయారు. మరొకరికి తీవ్రగాయాలయ్యాయి. మృతులంతా నారాయణపేట జిల్లాకు చెందినవారిగా గుర్తించారు.
 
ఈ జిల్లాలోని మరికల్ మండలం పెద్దచింతకుంట గ్రామానికి చెందిన నరసింహా రెడ్డి, లక్ష్మి దంపతుల పిల్లలు మౌనిక, భరత్ ఇద్దరు టెక్సాస్‌లో ఉద్యోగాలు చేస్తున్నారు. 4 నెలల క్రితం నరసింహా రెడ్డి, లక్ష్మి టెక్సాస్‌లోని తమ కొడుకు, కూతురు వద్దకు వెళ్లారు. 
 
తమ బంధువుల ఇంట్లో జరిగిన ఓ కార్యక్రమంలో వారు నలుగురు పాల్గొని, తిరిగి వస్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నరసింహా రెడ్డి, ఈయన భార్య లక్ష్మితో పాటు కుమారుడు భరత్ అక్కడికక్కడే మృతి చెందారు. 
 
కూతురు మౌనికకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ఆమెను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నరసింహా రెడ్డి ఆర్టీసీ కండక్టర్‌గా హైదరాబాద్ డిపో -1 లో విధులు నిర్వహించేవాడు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా వైరస్ కేసుల తాజా సమాచారం ఏంటి?