Webdunia - Bharat's app for daily news and videos

Install App

బీఆర్ఎస్ ఆవిర్భావం - ఆ రెండు జెండాలకు ఉన్న తేడాలు ఇవే..

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చగా, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ శుక్రవారం జరిగింది. ఈసీ పంపిన లేఖపై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 1.20 గంటలకు సంతకం చేశారు. దీంతో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్తగా పురుడు పోసుకుంది. 
 
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కోసం రూపొందించిన జెండాను ఆవిష్కరించారు. తెరాస జెండాలోనే పలు మార్పులు చేసి బీఆర్ఎస్ జెండాగా ప్రకటించారు. ముఖ్యంగా, తెరాస జెండాలో తెలంగాణ పటం ఉండేది. దాని స్థానంలో ఇపుడు భారత్ పటం చేరింది. అలాగే, జై తెలంగాణ నినాదానికి బదులుగా, జై భారత్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జెండా గుర్తు మాత్రం గులాబీ రంగులోనే ఉంది. 
 
కాగా, బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెరాస ఇకపై కనుమరుగు కానుంది. కేవలం చరిత్ర పుటల్లోనే ఓ అధ్యాయంగా మిగిలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sethupathi: సార్‌ మేడమ్‌ కోసం పరాటా చేయడం నేర్చుకున్నా : విజయ్ సేతుపతి

ప్రపంచంలో జరిగే బర్నింగ్ పాయింట్ నేపథ్యంగా థాంక్యూ డియర్

హిస్టారికల్ యాక్షన్ డ్రామా గా రిషబ్ శెట్టితో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ చిత్రం

చిరంజీవి విశ్వంభర చిత్రంలో ఐదుగురు హీరోయిన్లా? దర్శకుడు ఏమంటున్నారు

రిసార్టులో హంగామా సృష్టించిన సినీ నటి కల్పిక

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బొప్పాయి ఆరోగ్యానికి మంచిదే, కానీ వీరు తినకూడదు

కరివేపాకుతో చెడు కొవ్వు, రక్తపోటుకి చెక్

ఆల్‌బుకరా పండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామకాయ తింటే ఎన్ని ప్రయోజనాలు, ఏంటి?

Snacks: బరువు తగ్గాలనుకునే మహిళలు హెల్దీ స్నాక్స్ తీసుకోవచ్చు.. ఎలాగంటే?

తర్వాతి కథనం
Show comments