బీఆర్ఎస్ ఆవిర్భావం - ఆ రెండు జెండాలకు ఉన్న తేడాలు ఇవే..

Webdunia
శుక్రవారం, 9 డిశెంబరు 2022 (17:01 IST)
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సారథ్యంలో భారత్ రాష్ట్ర సమితి ఆవిర్భవించింది. ఇప్పటివరకు ఉన్న తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత్ రాష్ట్ర సమితిగా మార్చగా, దీనికి కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆమోదం తెలిపింది. దీంతో బీఆర్ఎస్ ఆవిర్భావ సభ శుక్రవారం జరిగింది. ఈసీ పంపిన లేఖపై సీఎం కేసీఆర్ శుక్రవారం మధ్యాహ్నం సరిగ్గా 1.20 గంటలకు సంతకం చేశారు. దీంతో దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ కొత్తగా పురుడు పోసుకుంది. 
 
ఈ సందర్భంగా బీఆర్ఎస్ కోసం రూపొందించిన జెండాను ఆవిష్కరించారు. తెరాస జెండాలోనే పలు మార్పులు చేసి బీఆర్ఎస్ జెండాగా ప్రకటించారు. ముఖ్యంగా, తెరాస జెండాలో తెలంగాణ పటం ఉండేది. దాని స్థానంలో ఇపుడు భారత్ పటం చేరింది. అలాగే, జై తెలంగాణ నినాదానికి బదులుగా, జై భారత్ అనే నినాదంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ జెండా గుర్తు మాత్రం గులాబీ రంగులోనే ఉంది. 
 
కాగా, బీఆర్ఎస్ పార్టీ ఆవిష్కరణ కార్యక్రమంలో కర్నాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమార స్వామితో పాటు సినీ నటుడు ప్రకాష్ రాజ్ కూడా హాజరయ్యారు. బీఆర్ఎస్ ఆవిర్భావంతో తెరాస ఇకపై కనుమరుగు కానుంది. కేవలం చరిత్ర పుటల్లోనే ఓ అధ్యాయంగా మిగిలిపోనుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Teja Sajja: వాలా Ⅱ వంటివి తెలుగులో మరిన్ని కావాలి : హీరో తేజ సజ్జా

Mrunal Thakur : ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్ వర్సెస్ పూజా హెగ్డే:

Salman khan: సల్మాన్ ఖాన్, నయనతార యాక్షన్ సినిమా ముంబైలో షూటింగ్ ప్రారంభం

గెలిస్తే రాజభోగం ఓడిపోతే వీరస్వర్గం అదే నచ్చింది : రఘు కుంచె

Nani: పారడైజ్ కే అడ్రెస్ అయితా అంటూ జడలతో హడలెత్తిస్తున్న నాని

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Student: నెలసరిని ఆలస్యం చేసింది.. 18 ఏళ్ల యువతి మృతి

వేసవిలో హైడ్రేటెడ్‌గా వుంచే పండ్లు ఇవే

ఉదయాన్నే ఖాళీ కడుపుతో తినదగిన ఆహార పదార్థాలు ఏమిటి?

గోల్డెన్ మిల్క్ హెల్త్ సీక్రెట్స్

గుండె సంబంధ వ్యాధులు రాకుండా వుండాలంటే ఏం చేయాలి?

తర్వాతి కథనం
Show comments