Webdunia - Bharat's app for daily news and videos

Install App

జనగామలో దెయ్యం.. మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని డ్యాన్స్ చేస్తోంది..

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:07 IST)
ఇంట్లో దెయ్యముందని ఏకంగా కాలనీ మొత్తం ఖాళీ చేశారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రాణ భయంతో బేడ, బుడగ జంగాల ప్రజలు పారిపోయారు. జనగామ జిల్లా తరిగొప్పుల మండలంలోని పోతారం గ్రామంలో సుమారు 40 కుటుంబాలు కాలనీని విడిచిపెట్టి పోవడంతో కాలనీ పూర్తి నిర్మానుష్యంగా మారిపోయింది.
 
పదేళ్లుగా కాలనీలో నిరుపయోగంగా ఉన్న ఓ పాత బిల్డింగ్‌లో రాత్రుళ్లు దెయ్యం తిరుగుతోందంటూ ప్రచారం మొదలైంది. మహిళ నగ్నంగా బోనం ఎత్తుకుని డ్యాన్స్ చేస్తోందని కాలనీ వాసులు చెబుతున్నారు.
 
బేడ బుడగ జంగాల కాలనీలో చింతల భాను, చింతల బాలరాజు అనే అన్నదమ్ములు గతేడాది అక్టోబర్‌లో వారం గ్యాప్‌లోనే మరణించారు. అదే కాలనీకి చెందిన గంధం రాజు అనే వ్యక్తి తాజాగా రోడ్డు ప్రమాదంలో మరణించాడు. వీటన్నిటికీ చేతబడి, దెయ్యమే కారణమై ఉంటుందని కాలనీవాసులు బలంగా నమ్మడంతో ఒక్కొక్కరుగా వలస బాటపట్టారు.
 
అలా మంగళవారం నాటికి కాలనీ పూర్తిగా ఖాళీ అయింది. కాలనీకి చెందిన గంధం శేఖర్‌ అనే వ్యక్తి మాట్లాడుతూ.. కాలనీలో యువకులు మాత్రమే చనిపోతున్నారని, ఎవరికైనా ఆరోగ్యం బాగోలేకపోతే ఆస్పత్రికి తీసుకెళ్తే రిపోర్టుల్లో ఏమీ లేదనే వస్తుందని చెబుతున్నారు. అక్కడ ఉండటం సేఫ్ కాదని భావించి మండల కేంద్రానికి వెళ్లి బతుకుతున్నామని అంటున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sharva: శర్వా, సంయుక్త పై నారి నారి నడుమ మురారి ఫస్ట్ సింగిల్

నెలకు 67 రూపాయల ప్యాక్ తో ఖర్చు తక్కువ కిక్ ఎక్కువ అంటున్న ఆహా ఓటీటీ

Balayya: ఎనిమిది నెలలు నిద్రాహారాలు మాని కృషి చేసి సినిమాని రీస్టోర్ చేశారు : బాలకృష్ణ

Kadambari: వ‌దిలేసిన నిస్సాహ‌యుల‌ను మేం చేరదీస్తాం : మనం సైతం కాదంబరి

Namrata: సితార ఘట్టమనేని తొలి చిత్రం ఎప్పుడు.. నమ్రత ఏం చెప్పారు?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయి తగ్గితే?

మనసే సుగంధం తలపే తీయందం

మెదడుకి అరుదైన వ్యాధి స్టోగ్రెన్స్ సిండ్రోమ్‌: విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్ విజయవంతంగా చికిత్స

తర్వాతి కథనం
Show comments