Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేను తిరుమలేశుని దయతో బ్రతుకుతున్నా, అందుకే 3 కోట్లతో శంకుచక్రాలు

Webdunia
బుధవారం, 24 ఫిబ్రవరి 2021 (13:05 IST)
ఓం నమో వేంకటేశాయ. ఆ తిరుమల వేంకటేశుని దివ్యమంగళరూపం ఎన్నిసార్లు వీక్షించినా తనివితీరనది. భక్తుల పాలిట కల్పతరువై ఏడుకొండలపై వెలసిన శ్రీ వేంకటేశ్వరునికి భక్తులు తమ శక్తికొలది కానుకలు సమర్పించుకుంటూ వుంటారు. బుధవారం తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు భారీ కానుక సమర్పించాడు. శ్రీవారికి శంకుచక్రాలను చేయించి సమర్పించాడు.
 
వీటి విలువ సుమారు రూ .2 కోట్లు వుంటుందని అంచనా. 3.5 కిలోల బంగారంతో స్వామి కోసం శంకు, చక్రాలను తయారు చేసినట్లు తంగదొరై వెల్లడించారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో అదనపు ఆభరణాలను సమర్పించారు.
తంగదొరై గతంలో కూడా శ్రీవారికి బంగారు, వజ్రాల ఆభరణాలను కానుకగా ఇచ్చారు. వాటిలో బంగారు వడ్డాణం, బంగారు చేతులు, హారము ఉన్నాయి. తిరుమల బాలాజీకి ఎప్పుడూ చాలా విలువైన కానుకలను భక్తులు సమర్పిస్తూనే వుంటారు.
 
భక్తులు బంగారు, వెండి ఆభరణాలతో పాటు వజ్రాలు, భూములను అర్పిస్తుంటారు. ఇప్పటికే చాలా మంది భక్తులు నగదు రూపంలో భారీ కానుకలు ఇచ్చారు. ఆ విధంగా భక్తులు వివిధ రూపాల్లో వెంకటేశ్వరస్వామికి కానుకలు ఇవ్వడం ద్వారా తమ మొక్కులు చెల్లించుకుంటూ వుంటారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'హరిహర వీరమల్లు' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎపుడు.. ఎక్కడ?

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments