కరీంనగర్‌లో కారు బీభత్సం... నిద్రిస్తున్న నలుగురు మృతి

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (09:08 IST)
తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ జిల్లాలో ఆదివారం తెల్లవారుజామున దారుణం జరిగింది. స్థానిక కమాన్ చౌరస్తాలో ఓ కారు బీభత్సం సృష్టించింది. ఓ గుడిసెపైకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. వీరంతా ఓ గుడిసెలో నిద్రస్తున్న వారే కావడం గమనార్హం. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు.
 
ఈ ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు... ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. మృతులను ఫరియాద్, సునీ, లలిత, జ్యోతిలుగా గుర్తించారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు కేసు దర్యాప్తు జరుపుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సివుంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పెద్ది రామ్‌చరణ్ బాడీగార్డుకి రోజుకి రూ. 2 లక్షల జీతం, అదిరిపోతున్న టాలీవుడ్

Trisha: ఇప్పట్లో ఎన్నికల్లో పోటీ చేయకూడదనుకుంటున్న త్రిష? ఎందుకో తెలుసా?

అనన్య పాండేకు ఆన్‌లైన్ ట్రోలింగ్.. అది భరత నాట్యమేనా? (video)

Ananth Sriramఫ మా తల్లిదండ్రులను కాపాడండి: అనంత్ శ్రీరామ్

Ramcharan: పెద్ది వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ అవుతోంది రాసిపెట్టుకోండి.: రామ్ చరణ్

తర్వాతి కథనం
Show comments