Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బీభత్సం సృష్టించిన లారీ - ఐదుగురు దుర్మరణం ... ఎక్కడ?

బీభత్సం సృష్టించిన లారీ - ఐదుగురు దుర్మరణం ... ఎక్కడ?
, సోమవారం, 24 జనవరి 2022 (10:53 IST)
ఓ లారీ బీభత్సం సృష్టించింది. ఈ కారణంగా ఐదుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె జిల్లాలో జరిగింది. స్కూటర్‌ను లారీ ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, పూణె - అహ్మద్ నగర్ రహదారిపై అతివేగంగా దూసుకొచ్చిన ఓ లారీ కారును ఢీకొట్టింది. అక్కడితో ఆగకుండా మరో రెండు మోటార్ సైకిళ్లపైకి దూసుకెళ్లింది. దీంతో మొత్తం ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. 
 
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే, ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి వివరాలు తెలియాల్సివుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో కరోనా విలయతాండవం.. లాక్డౌన్ విధింపు దిశగా ఆలోచనలు?