Webdunia - Bharat's app for daily news and videos

Install App

ట్రెజరీ ఉద్యోగులంతా ఆదివారం కూడా పనిచేయాలి : ఏపీ సర్కారు

Webdunia
ఆదివారం, 30 జనవరి 2022 (08:58 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ట్రెజరీ ఉద్యోగులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తేరుకోలేని షాకిచ్చింది. ఆదివారం కూడా పని చేయాలంటూ ఆదేశాలు జారీచేసింది. ఆదివారం ఉదయం 10.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కార్యాలయాల్లోనే ఉండి వేతన బిల్లులు క్లియర్ చేయాలంటూ ఆ ఆదేశాల్లో సూచించింది. ఈ మేరకు అన్ని ట్రెజరీ కార్యాలయాలకు వాట్సాప్ సందేశాలను పంపించింది. అలాగే, ఇతర శాఖల నుంచి వచ్చిన బిల్లులను కూడా క్లియర్ చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. తమ ఆదేశాలను ఉల్లంఘిస్తే క్రమశిక్షణా చర్యలు తప్పవని ఉన్నతాధికారులు హెచ్చరించారు. 
 
కాగా, కొత్త పీఆర్సీ ప్రకారం హెచ్.ఆర్.ఏను సవరించారు. విజయాడలోని హెచ్ఓడీ కార్యాలయాల ఉద్యోగులకు, విజయవాడ పరిసర ప్రాంతాల్లో పనిచేసే ఉద్యోగులకు 16 శాతం పెంచారు. కాగా, ట్రెడరీ, డీడీవో సిబ్బంది సహకరించకపోతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరుక రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రావత్ ఆదేశాలు జారీచేశారు. 
 
మరోవైపు, పీఆర్సీ అంశంలో ప్రభుత్వానికి, ఉద్యోగ సంఘాలకు మధ్య ఏకాభిప్రాయం కుదరకపోతే ఉద్యోగులు ఆందోళనలకు ఉపక్రమించారు. ఫిబ్రవబరి 3వ తేదీన ఛలో విజయవాడ కార్యక్రమం చేడుతున్న ఉద్యోగులు 7వ తేదీన నిరవధిక సమ్మెకు సిద్ధమవుతున్న విషయం తెల్సిందే. 

సంబంధిత వార్తలు

కనీసం నా పిల్లలతో చాక్లెట్ పార్టీకి కూడా తీరికలేదు, రేవ్ పార్టీనా?: జానీ మాస్టర్ - video

రేవ్ పార్టీలో పట్టుబడ్డ అతడెవరో నాలాగే వున్నాడు: శ్రీకాంత్ మేకా

అబ్బాయిలూ ఇలా అమ్మాయిలకు ప్రపోజ్ చేస్తే చెంపలు చెళ్లుమంటాయి

పాయల్ రాజ్‌పుత్ పైన రక్షణ నిర్మాత ఫిలిం ఛాంబర్‌కు ఫిర్యాదు

దీక్షిత్ శెట్టి క్రైమ్ కామెడీ థ్రిల్లర్ టైటిల్ బ్యాంక్ ఆఫ్ భాగ్యలక్ష్మి

కిడ్నీలకు మేలు చేసే చింతచిగురు, ఇంకా ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

శరీరంలో యూరిక్ యాసిడ్‌కు బైబై చెప్పాలంటే.. ఇవి వద్దే వద్దు..

ఈ 8 పండ్లను రాత్రి భోజనం చేసిన తర్వాత తీసుకోకూడదట

ఫోలిక్యులర్ లింఫోమా స్టేజ్ IV చికిత్సలో విజయవాడ అమెరికన్ ఆంకాలజీ ఇన్‌స్టిట్యూట్ విశేషమైన విజయం

చేతులతో భోజనం తినడం వల్ల 5 ఉత్తమ ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments