Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్: ఖమ్మంలో యువతికి పాజిటివ్

Webdunia
సోమవారం, 27 డిశెంబరు 2021 (11:54 IST)
తెలంగాణ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసు నమోదైంది. ఖమ్మం పట్టణంలోని వైరా రోడ్డులో సీఆర్‌జీ టవర్స్‌లో ఉంటున్న ఫ్యామిలీకి చెందిన 21ఏళ్ల యువతికి ఒమిక్రాన్ నిర్ధారణ అయింది. వివరాల్లోకి వెళితే.. ఖమ్మంకు చెందిన యువతి హైదరాబాద్‌ మెహిదీపట్నంలోని ఓ కాలేజీలో చదువుకుంటోంది. కొద్దిరోజులుగా జలుబు, దగ్గు, జ్వరంతో బాధపడుతుండటంతో వారం రోజుల క్రితం ఇంటికి వెళ్లింది. 
 
ఈ నెల 19వ తేదీన ఖమ్మం ప్రభుత్వాసుపత్రిలో కరోనా టెస్టుకు శాంపిల్ ఇచ్చింది. అయితే ఆమెలో ఒమిక్రాన్ లక్షణాలు కనిపించడంతో అధికారులు ఆ శాంపిల్‌ను హైదరాబాద్‌లోని ల్యాబ్‌కు పంపించారు. అక్కడ పరీక్షించిన వైద్య నిపుణులు ఆమెకు ఒమిక్రాన్ సోకినట్లు నిర్ధారించారు. 
 
దీంతో అప్రమత్తమైన ఖమ్మం అధికారులు ఆమెను హైదరాబాద్‌లోని కిమ్స్‌కు తరలించారు. ప్రైమరీ కాంటాక్ట్ కింద యువతి కుటుంబసభ్యులకూ పరీక్షలు నిర్వహించిన వైద్యులు వారి శాంపిళ్లను కూడా ల్యాబ్‌కు పంపారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆత్మహత్య చేసుకున్న మొదటి భర్త.. రెండో వివాహం చేసుకోనున్న నటి!!

బిగ్ బాస్‌ ఇంట్లో మొదలైన ప్రేమ.. అమీర్‌ను పెళ్లాడనున్న పావని రెడ్డి

భారతీయ సినిమా కథల్లోకి హిందూయిజం, ఆధ్యాత్మికత ప్రవేశిస్తున్నాయా? ప్రత్యేక కథనం

మస్తాన్ సాయి వల్ల దర్గాకు అపవిత్రత... గవర్నర్‌కు లావణ్య లేఖ

రజనీకాంత్‌ కూలీలో అమితాబ్‌, నాగార్జున ఎంట్రీ షురూ !

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

న్యూజెర్సీలో నాట్స్ ఆర్ధిక అవగాహన సదస్సు

సందీప్ మక్తాలా, బాబా రామ్‌దేవ్ సమన్వయంతో సమగ్ర ఆరోగ్య విప్లవం

GBS Virus: మహారాష్ట్రలో కొత్త వైరస్.. ఏపీలోనూ పదేళ్ల బాలుడి మృతి.. లక్షణాలివే.. అలెర్ట్

ఎసిడిటీని పెంచే 10 ఆహారాలు, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments