Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!

అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై నేడు తుది నిర్ణయం!
, సోమవారం, 27 డిశెంబరు 2021 (08:30 IST)
దేశంలో ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తి భయపెడుతోంది. రోజురోజుకూ ఈ కేసులు పెరిగిపోతున్నాయి. పలు రాష్ట్రాలకు కూడా ఈ వైరస్ వ్యాప్తి చెందుతోంది. దీంతో వచ్చే యేడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికలను వాయిదావేయాలంటూ ఇటీవల అలహాబాద్ హైకోర్టు సూచన చేసింది. అలాగే, కొన్ని రాజకీయ పార్టీల నేతలు కూడా ఇదే తరహా డిమాండ్ చేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణపై అస్పష్టత నెలకొంది. ఈ పరిస్థితుల్లో కేంద్ర ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులతో కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ప్రత్యేకంగా సమావేశంకానుంది. ఎన్నికలు జరగబోయే రాష్ట్రాల్లో కరోనా వ్యాప్తిపై ఆరా తీయనుంది. ఆ తర్వాత ఈ రాష్ట్రాల్లో ఎన్నికల నిర్వహణపై ఓ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

న్యూ ఇయర్ ఆఫర్ - రోజుకు 5 జీబీ డేటాతో బీఎస్ఎన్ఎల్