కన్న కొడుకుని సిమెంట్ బిళ్లతో తల పగులగొట్టి హత్య చేసిన తండ్రి

Webdunia
బుధవారం, 26 ఫిబ్రవరి 2020 (13:47 IST)
ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం గంగుబండ తండా గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మద్యం మత్తులో తండ్రి, కొడుకుని కొట్టి చంపిన సంఘటన కలకలం రేపింది. గంగుబండ తండాకు చెందిన వడిత్య రవి (29) మద్యానికి బానిసై ప్రతిరోజు తండ్రితో గొడవ పడుతూ ఉండేవాడు. రోజు లాగానే ఈరోజు కూడా మద్యం మత్తులో ఉన్న రవి, తండ్రి మల్సూర్‌తో గొడవ పడటంతో తండ్రి మల్సూర్ కూడా మద్యం మత్తులో ఉన్నాడు.
 
కొడుకుతో విసిగిపోయిన తండ్రి సిమెంట్ బిళ్ళతో రవి తలపై గట్టిగా మోదడంతో రవి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు రవికి భార్య ఉంది. మద్యానికి బానిసైన రవి నుంచి భార్య ఐదు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకొని పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మద్యానికి బానిసైన రవి తండ్రితో రోజూ గొడవ పడుతూ ఉండేవాడు. తల్లి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Tharun Bhascker: గాయపడ్డ సింహం గా తరుణ్ భాస్కర్ ఏమి చేశాడు !

నాగార్జున వాయిస్ ఓవర్ తో అనిష్ చిత్రం ఇట్లు అర్జున

టెలివిజన్‌ టీఆర్‌పీతో రికార్డులను బద్దలు కొట్టిన తేజ సజ్జా మిరాయ్

Yash: టాక్సిక్‌ తెలుగు రాష్ట్రాల హ‌క్కుల‌ను 120 కోట్ల‌కు సొంతం చేసుకున్న దిల్ రాజు

Unni Mukundan: హైదరాబాద్ లో షెడ్యూల్ పూర్తి చేసుకున్న మోదీ బయోపిక్ మా వందే

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉప్పు అధికంగా తీసుకుంటే 7 సమస్యలు, ఏంటవి?

ఊపిరితిత్తుల క్యాన్సర్ చుట్టూ ఉన్న అతిపెద్ద అపోహలు బట్టబయలు

Dry Fish : పురుషులకు మేలు చేసే ఎండు చేపలు.. మధ్యాహ్నం భోజనంలో భాగం చేస్తే?

కివి పండు తింటే 7 ప్రయోజనాలు, ఏంటవి?

ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం 2026: రొమ్ము క్యాన్సర్‌తో జీవిస్తున్న వారికోసం 5 మానసిక ఆరోగ్య చిట్కాలు

తర్వాతి కథనం
Show comments