Webdunia - Bharat's app for daily news and videos

Install App

వరకట్న వేధింపులు... ప్రేమ పెళ్లి చేసుకున్నా వేధింపులు.. చివరికి?

Webdunia
సోమవారం, 3 మే 2021 (18:55 IST)
వరకట్న వేధింపులు ఓ యువతి ప్రాణాలు తీసింది. పెద్దలను ఒప్పించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి ఏడాది తిరక్కుండానే కన్ను మూసిన విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటుచేసుకుంది. 
 
వివరాల్లోకి వెళితే.. హుజూర్ నగర్, సుందరయ్య నగర్‌కు చెందిన ఆత్కూరి సుజాత రెండో కుమార్తె మౌనిక (19) అదే ప్రాంతానికి చెందిన పంగ నాగరాజు అనే యువకుడిని ప్రేమించి, పెద్దలను ఒప్పించి గతేడాది మే 14న పెళ్లి చేసుకుంది.
 
పెళ్లి సమయంలో వరకట్నం కింద 20 కుంటల భూమిని ఇచ్చేందుకు మౌనిక తల్లి సుజాత ఒప్పుకుంది. గత కొంతకాలంగా నాగరాజు మౌనికను వేధించటం మొదలెట్టాడు. పెళ్లి సమయంలో ఇస్తానన్న భూమిని తన పేరున రిజష్ట్రేషన్ చేయించుకు రమ్మనమని వేధించసాగాడు
 
భర్త వేధింపులు భరించలేని మౌనిక మే 1 శనివారం సాయంత్రం పురుగుల మందు తాగి బలవన్మరణానికి ప్రయత్నించింది. గమనించిన భర్త ఆమెను వెంటనే స్ధానిక ఆస్పత్రికి తరలించాడు. కానీ చికిత్స పొందుతూ శనివారం అర్ధరాత్రి మరణించింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Peddi : పెద్ది చిత్రం తాజా అప్ డేట్ - రామ్ చరణ్ పై కీలక సన్నివేశాల చిత్రీకరణ

థ్రిల్లర్ కథతో మలయాళ ప్రవింకూడు షప్పు- ప్రవింకూడు షప్పు సమీక్ష

ఆంజనేయ స్వామి దయతో మార్క్ శంకర్ ఇంటికొచ్చేసాడు : చిరంజీవి

అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో వచ్చేస్తున్న తల్లి మనసు

Nikhil: దేవుడి దయవల్ల తొలి సినిమా హ్యాపీ డేస్ అయింది : హీరో నిఖిల్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

బీపీ వున్నవారు యాలుక్కాయను తింటే ఏమవుతుంది?

తర్వాతి కథనం
Show comments