కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా అంగన్‌వాడీ టీచర్ మృతి.. ఛాతిలో నొప్పి అంటూ..?

Webdunia
సోమవారం, 25 జనవరి 2021 (10:09 IST)
కోవిడ్ వ్యాక్సిన్ కారణంగా వరంగల్‌ జిల్లాలో అంగన్‌వాడీ టీచర్ ఆకస్మికంగా మృతిచెందింది. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్న నాలుగు రోజులకే ఆమె మరణించడం స్థానికంగా కలకలం రేపింది. ఛాతిలో నొప్పి కారణంగా ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. వరంగల్ నగరం దీన్దయాళ్‌నగర్‌కు చెందిన గన్నారపు వనిత(45) అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. హెల్త్ కేర్ వర్కర్‌గా కూడా పనిచేస్తున్నారు. 
 
జనవరి 19న ఆమె తన తోటి ఉద్యోగులతో కలిసి న్యూశాయంపేట అర్బన్ హెల్త్ సెంటర్‌లో కోవిడ్ వ్యాక్సిన్ వేయించారు. అయితే మూడు రోజులు బాగానే ఉన్న వనిత.. శనివారం(జనవరి 23)న తనకు ఛాతీలో నొప్పిగా ఉన్నట్టు వైద్యుల దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఆమె వైద్యులు మందులు ఇచ్చి ఇంటికి పంపారు. నొప్పి ఎక్కువైతే ఎంజీఎం ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు. 
 
అయితే నొప్పి తగ్గడంతో వనిత ఇంటివద్దే ఉంది. అయితే ఆదివారం ఉదయం వనిత నిద్రలేవలేదు. కుటుంబ సభ్యులు ఆమెను నిద్ర లేపేందుకు ప్రయత్నించిన స్పందన లేదు. దీంతో వారు వైద్యులకు సమాచారం అందజేశారు. దీంతో ఆమె నిద్రలోనే మరణించినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. అనంతరం వనిత మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. నివేదిక అందిన తర్వాతనే ఆమె మృతికి గల కారణాలు తెలుస్తాయని తెలిపింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇనికా ప్రొడక్షన్స్ లో ఇండియన్ అనిమేషన్ సినిమా కికీ & కోకో

జయకృష్ణ ఘట్టమనేని సినిమాలో హీరోయిన్ గా రషా తడాని

Balakrishna: అఖండ 2: తాండవం నుంచి జాజికాయ సాంగ్ చిత్రీకరణ

Nag Aswin: కొత్తవారితో సింగీతం శ్రీనివాసరావు, నాగ్ అశ్విన్‌ సినిమా !

హైదరాబాద్ సీపీ సజ్జనార్‌పై పవన్ కళ్యాణ్ ప్రశంసలు.. ఎందుకో తెలుసా?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తాటి బెల్లం తింటే 9 ప్రయోజనాలు, ఏంటవి?

నిమ్మకాయ టీ తాగేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఊపిరితిత్తుల సమస్యలను అరికట్టే 5 మూలికలు, ఏంటవి?

డయాబెటిక్ రెటినోపతిపై డాక్టర్ అగర్వాల్స్ కంటి ఆసుపత్రి అవగాహన కార్యక్రమం

sesame seeds నువ్వులు తింటే కలిగే ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments