Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భయపడొద్దండి, కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు: రోజా

భయపడొద్దండి, కరోనా వ్యాక్సిన్ వల్ల ఏమీ కాదు: రోజా
, శనివారం, 16 జనవరి 2021 (21:21 IST)
దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రతి నియోజకవర్గంలో అక్కడున్న ప్రజాప్రతినిధులు కరోనా వ్యాక్సిన్ కార్యక్రమాన్ని ప్రారంభించి పర్యవేక్షిస్తున్నారు. చిత్తూరు జిల్లా నగరిలో కూడా ఎపిఐఐసి ఛైర్ పర్సన్ ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
 
హెల్త్ వర్కర్లకు టీకా వేస్తున్న ప్రాంతాన్ని పరిశీలించారు. పదిమందికి పైగా కరోనా వ్యాక్సిన్ వేస్తుండగా చూశారు రోజా. టీకా వేసుకున్న తరువాత వారితో స్వయంగా మాట్లాడారు. టీకా వేసుకున్న వెంటనే ఏదైనా శరీరంలో మార్పులు కనిపిస్తున్నాయా.. ఇబ్బంది పడుతున్నారా.. ఆయాసంగా ఉందా.
 
బొబ్బలు వస్తున్నాయా అంటూ ప్రశ్నించారు. అంటే ఇప్పటికే రకరకాల దుష్ర్పచారాలు జరుగుతున్న నేపథ్యంలో రోజా నేరుగా టీకా వేసుకున్న వారితో మాట్లాడి అనుమానాన్ని నివృత్తి చేసి ప్రజలకు తెలియజేసేలా ప్రసంగించారు. కరోనా టీకాపై రకరకాల దుష్ప్రచారాలు జరుగుతున్నాయి. వీటిని ఎవరూ నమ్మొద్దండి అని విజ్ఞప్తి చేశారు రోజా. వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఏమీ కాదన్నారు రోజా.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోవిడ్ -19 : డాక్టర్ రెడ్డీస్ Sputnik Vకి డీసీజీఐ అనుమతి.. భారతీయులకు సురక్షితం