Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

జనవరి 13 నుంచి కరోనా టీకాల పంపిణీ : కేంద్రం ప్రకటన

Advertiesment
Covid 19
, మంగళవారం, 5 జనవరి 2021 (18:04 IST)
దేశ ప్రజలకు కేంద్రం ఓ శుభవార్త చెప్పింది. కరోనా భయంతో తల్లడిల్లిపోతున్న వారికి ఈ వార్త ఎంతో ఉపశమనం కలిగించనుంది. ఈ నెల 13వ తేదీ నుంచి దేశంలో కరోనా టీకాల పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్టు కేంద్రం తెలిపింది. 
 
దేశీయంగా అభివృద్ధి చేసిన కోవాగ్జిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లకు ఈ నెల మూడో తేదీన భారత ఔషధ నియంత్రణ సంస్థ (డీజీసీఐ) అత్యవసర వినియోగం కింద అనుమతి ఇచ్చిన విషయం తెల్సిందే. ఈ అనుమతులు మంజూరైన పది రోజుల్లోనే టీకాల పంపిణీ ప్రారంభించాలని భావిస్తున్నట్టు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 
 
ఇదే అంశంపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ, ఇటీవల నిర్వహించిన 'డ్రై రన్' ప్రక్రియ నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ ఆధారంగా కరోనా వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు.
 
భారత్‌లో కరోనా వ్యాక్సిన్ అభివృద్ధి, తయారీలో కీలకపాత్ర పోషిస్తున్న భారత్ బయోటెక్, సీరం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఇప్పటికే సంయుక్తంగా తమ సన్నద్ధతను వెల్లడించడం కేంద్రం ప్రకటనకు బలం చేకూర్చుతోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కలియుగం క్లైమాక్సులో వున్నాం, బాబు 36 దేవాలయాలను ధ్వంసం చేశాడు: సీఎం జగన్