Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

భారత్‌కు అమెరికా హెచ్చరిక : రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారో...

భారత్‌కు అమెరికా హెచ్చరిక : రష్యా నుంచి దిగుమతి చేసుకున్నారో...
, మంగళవారం, 5 జనవరి 2021 (11:30 IST)
భారత్‌కు అమెరికా గట్టివార్నింగ్ ఇచ్చింది. రష్యా నుంచి ఎలాంటి ఆయుధాలను కొనుగోలు చేయరాదని వార్నింగ్ చేసింది. తమ హెచ్చరికలను ఉల్లంఘిస్తే మాత్రం ఆంక్షలు తప్పవని హెచ్చరించింది. 
 
కాగా, రష్యా - భారత్ దేశాల మధ్య ఏర్పడిన రక్షణ ఒప్పందాల్లో భాగంగా రూ.వందల కోట్ల విలువైన ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్‌ను కొనుగోలు చేయాలని భారత్ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఇండియాకు అమెరికా రూపంలో అడ్డంకులు తగులుతున్నాయి. 
 
ఈ అత్యాధునిక మిసైల్ సిస్టమ్‌ను రష్యా నుంచి కొనేందుకు గతంలోనే ఇండియా డీల్ కుదుర్చుకోగా, తాజాగా విడుదలైన యూఎస్ కాంగ్రెస్ రిపోర్టు, ఇండియా ఆయుధాలు కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధిస్తామని హెచ్చరించింది. 
 
యూఎస్ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని సీఆర్ఎస్ (కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్) తన తాజా నివేదికలో భారత్ తన రక్షణ విధానాన్ని మార్చుకోవాలని, సంస్కరణలు తీసుకు రావాలని సూచించింది.
 
మరింత సాంకేతికతను అందుకోవాలన్న ప్రయత్నాలు కూడదని, రక్షణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల పరిధిని మరింతగా పెంచాలని, రక్షణ విధానాన్ని మార్చుకోవాలని సూచించింది. 
 
"రష్యా తయారు చేసుకున్న ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కు మేము వ్యతిరేకం. వీటిని ఇండియా కొనుగోలు చేస్తే, ఆంక్షలు విధించే అవకాశం ఉంది. అమెరికా ఆంక్షల చట్టానికి ఇండియా - రష్యా డీల్ వ్యతిరేకంగా ఉండటమే ఇందుకు కారణం" అని సీఆర్ఎస్ పేర్కొంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల తాజా అప్‌డేట్స్