Webdunia - Bharat's app for daily news and videos

Install App

గంజాయిపై యుద్ధం ప్రకటించాలి: సీఎం కేసీఆర్ పిలుపు

Webdunia
బుధవారం, 20 అక్టోబరు 2021 (18:24 IST)
గంజాయిపై యుద్ధం ప్రకటించాలని సీఎం కేసీఆర్‌ పిలుపునిచ్చారు. డ్రగ్స్‌ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలన్నారు. డ్రగ్స్‌ మరియు గంజాయి అక్రమ రవాణా మరియు వాటి నియంత్రణ చర్యలపై సీఎం కేసీఆర్‌ సమీక్ష నిర్వహించారు. 
 
ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ మాట్లాడుతూ…. గంజాయి అక్రమ సాగు వినియోగంపై ఉక్కుపాదం మోపాలని… పరిస్థితి తీవ్రం కాకముందే అరికట్టాలని పేర్కొన్నారు. వాట్సాప్ గ్రూపుల ద్వారా గంజాయి సరఫరా చేస్తున్నారని… తెలిసీ తెలియక దీని బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
 
డ్రగ్స్ వినియోగం వల్ల మానసిక పరిస్థితి దెబ్బతింటుందని… ఆత్మహత్యకు పాల్పడే ప్రమాదం ఉందన్నారు. ఎంతటివారైనా ఉపేక్షించేదిలేదని… డీజీ స్థాయి అధికారిని ప్రత్యేకంగా నియామకం చేయాలని ఆదేశించారు. 
 
విద్యా సంస్థల దగ్గర ప్రత్యేక నిఘా పెట్టాలని… దీని కోసం ఇంటెలిజెన్స్ శాఖలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. గుడుంబా, గ్యాంబ్లింగ్ మళ్లీ వస్తున్నాయని… డ్రగ్స్ రహిత రాష్ట్రంగా తెలంగాణను చేయాలని వెల్లడించారు సీఎం కేసీఆర్.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అఖండ 2 లోనూ డబుల్ రోల్ చేస్తున్న నందమూరి బాలకృష్ణ

8 వసంతాలు హార్ట్ టచ్చింగ్ సెకండ్ టీజర్ రిలీజ్

మై లవ్ వీడియో సాంగ్ కథలా వుందంటున్న చిత్ర యూనిట్

Nagarjuna: కుబేర కు డబ్బింగ్ పూర్తి చేసిన నాగార్జున

బిగ్ బాస్ ఫేమ్ గౌతమ్ చిత్రం సోలో బాయ్ విడుదలకు సిద్ధం

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కొబ్బరి కల్లు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

శంఖం పువ్వులు ఆరోగ్యానికి చేసే మేలు ఏమిటి

తీపి పదార్థాలు తెచ్చే అనారోగ్యాలు

Horse Gram: మహిళలకు మేలు చేసే ఉలవలు.. ఆ నొప్పులు మటాష్

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

తర్వాతి కథనం
Show comments