Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎన్నికల అఫిడవిట్ల ట్యాంపరింగ్‌-మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు

Webdunia
శనివారం, 12 ఆగస్టు 2023 (10:21 IST)
ఎన్నికల అఫిడవిట్ల ట్యాంపరింగ్‌కు సంబంధించిన వివాదంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో సహా 11 మంది వ్యక్తులపై మహబూబ్‌నగర్ పోలీసులు అధికారికంగా కేసు నమోదు చేశారు. మహబూబ్‌నగర్‌లోని రెండు టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్య తీసుకున్నారు.
 
ఎన్నికల అఫిడవిట్ల తారుమారులో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ ప్రమేయం ఉందంటూ గతంలో ప్రజాప్రతినిధుల కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసిన నేపథ్యంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. 
 
ఈ పిటిషన్‌పై స్పందించిన నాంపల్లి కోర్టు శ్రీనివాస్ గౌడ్‌తో పాటు పలువురు ఎన్నికల అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మహబూబ్‌నగర్ పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాలను మహబూబ్‌నగర్ పోలీసులు పాటించడం లేదని, నిందితులపై కేసు నమోదు చేయలేదని పిటిషనర్ రాఘవేంద్రరాజు ఆందోళనకు దిగారు. దీంతో ప్రజాప్రతినిధుల కోర్టు ఈ అంశాన్ని మరోసారి విచారించింది. సమర్పించిన వాదనల అనంతరం కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను వెంటనే అందించాలని ధర్మాసనం పోలీసులను ఆదేశించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anna konidala: డిక్లరేషన్ పై సంతకం పెట్టి స్వామి కి మొక్కులు చెల్లించుకున్న అన్నా కొణిదల

ఖేల్ ఖతమ్ దర్వాజా బంద్ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్

Sathyaraj: ఆకట్టుకునేలా త్రిబాణధారి బార్బారిక్‌ లో తాత, మనవరాలి సాంగ్ : సత్యరాజ్

Rajamouli : ఆస్కార్‌ కేటగిరిలో స్టంట్ డిజైన్ వుండడం పట్ల రాజమౌళి హర్షం

అందం కోసం సర్జరీ చేయించుకున్న మౌనీ రాయ్?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

మెనోపాజ్ మహిళలకు మేలు చేసే శతావరి

ఇవి తింటే చెడు కొవ్వు కరిగిపోతుంది

పాలలో దాల్చిన చెక్క పొడి.. పరగడుపున తాగితే ఇంత మేలు జరుగుతుందా?

మెడ నొప్పితో బాధపడుతున్నారా? వేడినీటితో స్నానం.. ఈ చిట్కాలు పాటిస్తే?

భారతదేశవ్యాప్తంగా సూట్లు, షేర్వానీలపై మేడ్ ఫర్ యు, స్టిచ్డ్ ఫర్ ఫ్రీ ఆఫర్‌ను పరిచయం చేసిన అరవింద్ స్టోర్

తర్వాతి కథనం
Show comments