Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కోరుట్లలో దారుణం.. బైకుపై వచ్చి కౌన్సినర్‌ మెడపై కత్తిపోట్లు

knife
, మంగళవారం, 8 ఆగస్టు 2023 (18:29 IST)
తెలంగాణ రాష్ట్రంలోని జగిత్యాల జిల్లా కోరుట్లలో దారుణం జరిగింది. స్థానికంగా మున్సిపల్ కౌన్సిలర్ భర్త పోగుల లక్ష్మీరాజం (48)ను కొంతమంది దుండగులు కత్తితో దాడి చేశారు. దీంతో తీవ్రంగా గాయపడిన ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 
 
పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... కోరుట్ల పట్టణంలోని కార్గిల్ చౌరస్తా సమీపంలోని ఓ హోటల్‌లో లక్ష్మీరాజం తేనీరు సేవిస్తున్నాడు. ఆ సమయంలో ఇద్దరు దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆయన మెడపై ఉన్నట్టుండి కత్తితో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆయన్ను అక్కడున్న వారు హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. 
 
అక్కడ ఆయన అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. సమాచారం తెలుసుకున్న స్థానిక డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ ప్రవీణ్ కుమార్‌లు ఘటనా స్థలానికి వచ్చి పరిసరాలను పరిశీలించారు. దీనిపై కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మనిషిని పోలిన అవతార్‌.. వీడియో కాల్ స్కామ్‌.. బీ అలెర్ట్..