Webdunia - Bharat's app for daily news and videos

Install App

హైదరాబాద్ మెట్రోకు బాంబు బెదిరింపు.. ప్రయాణికుల పరుగోపరుగు

హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నే

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2017 (13:22 IST)
హైదరాబాద్ మెట్రో రైల్వే స్టేషన్‌కు బాంబు బెదిరింపులు వచ్చాయి. దీంతో ప్రయాణికులు ప్రాణభయంతో పరుగు పెట్టారు. గత నెల 29వ తేదీ నుంచి హైదరాబాద్ మెట్రో రైల్వే సేవలు అందుబాటులోకి వచ్చిన విషయం తెల్సిందే. ఈ నేపథ్యంలో నగరంలో అమీర్‌పేట్‌ మెట్రోస్టేషన్‌కు బాంబు బెదిరింపు వచ్చింది. 
 
స్టేషన్‌లో బాంబు పెట్టినట్లు పోలీసులకు సమాచారం రావడంతో వెంటనే అప్రమత్తమయ్యారు. బాంబు నిర్వీర్య బృందాలు హుటాహుటిన స్టేషన్‌ వద్దకు చేరుకుని తనిఖీలు చేపట్టాయి. హైదరాబాద్‌ మెట్రోరైలును నవంబర్‌ 28న ప్రధాని మోడీ ప్రారంభించగా.. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. తొలిరోజే ఏకంగా 2 లక్షల మంది ప్రయాణించడం ద్వారా మెట్రోరైలు రికార్డు సృష్టించింది.
 
ఈ నేపథ్యంలో అమీర్‌పేట్ మెట్రో  రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం అందరినీ టెన్షన్ పెట్టింది. స్టేషన్‌లో అనుమానాస్పదంగా ఉన్న బ్యాగులో బాంబు ఉన్నట్లు అనుమానించారు. జనం టెన్షన్ పడి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. బ్యాగ్‌ను చెక్  చేసిన పోలీసులు.. అందులో ఏమీ లేదని తేల్చడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చివరకు ఆ బ్యాగ్ స్టేషన్‌లో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డుదిగా గుర్తించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కన్నప్ప మూవీ రివ్యూ- కథ మారింది-కల్పితం: నేటి జనరేషన్ నిజం అని నమ్మే ప్రమాదం వుంది!

బిగ్ బాస్ సీజన్ 9- కాంట్రవర్సీలు ఖాయం.. హోస్టుగా నాగార్జునే ఖరారు

మత్తుకు అలవాటుపడిన నటీనటులను ఇండస్ట్రీ నుంచి బహిష్కరించాలి : దిల్ రాజు

Vishnu: కన్నప్ప నాట్ మైథలాజికల్ మంచు పురాణం అంటూ తేల్చిచెప్పిన విష్ణు

Coolie: రజనీకాంత్, టి. రాజేందర్, అనిరుద్ పై తీసిన కూలీ లోని చికిటు సాంగ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

డయాబెటిస్, ఏముందిలే ఇవి తినేద్దాం అనుకోరాదు, ఏంటవి?

ఆల్‌బుకరా పండ్లు తింటే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తల గాయంను అంచనా వేయడానికి ల్యాబ్ ఆధారిత రక్త పరీక్షను ప్రవేశపెట్టిన అబాట్

గోరింటతో ఆరోగ్యం, అందం

వ్రిటిలైఫ్ ఆయుర్వేద చర్మ సంరక్షణ శ్రేణికి ప్రచారకర్తలుగా స్మృతి మంధాన, మణికా బాత్రా

తర్వాతి కథనం