Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మొదటిరోజే హైదరాబాద్ మెట్రో రైల్లో ఫైన్లతో బాదుడే బాదుడు...

రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ఇన్‌స్పెక్టర్లు ఫైన్లు వేస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. ఐతే బుధవారం నాడు తెలంగాణలో ప్రారంభమైన మెట్రో రైలులో ప్రయాణికులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. రైలెక్కి దిగగానే

మొదటిరోజే హైదరాబాద్ మెట్రో రైల్లో ఫైన్లతో బాదుడే బాదుడు...
, బుధవారం, 29 నవంబరు 2017 (21:07 IST)
రైళ్లు, బస్సుల్లో టిక్కెట్లు లేనివారు, తెలియకుండా రిజర్వుడు బోగీలో ఎక్కేవారికి టికెట్ ఇన్‌స్పెక్టర్లు ఫైన్లు వేస్తుంటారు. ఇది మనకు తెలిసిందే. ఐతే బుధవారం నాడు తెలంగాణలో ప్రారంభమైన మెట్రో రైలులో ప్రయాణికులకు అయోమయ పరిస్థితి ఎదురైంది. రైలెక్కి దిగగానే ఎదురుగా ఫైన్ కట్టు అంటూ టికెట్ కలెక్టర్స్ ప్రత్యక్షమవడంతో షాక్ తిన్నారు. 
 
ఇలా ఎందుకు జరిగిందయా అంటే... మెట్రో రైల్లో నాగోల్ లేదంటే ఉప్పల్ నుంచి మియాపూర్ వెళ్లాలనుకునేవారు అమీర్ పేటకు వెళ్లి అక్కడి నుంచి మరో ట్రైన్లో ఎక్కాలి. ఒకవేళ ఉప్పల్ నుంచి మియాపూర్ వరకూ ఒకటే టిక్కెట్ తీసుకున్నప్పటికీ అమీర్ పేటలో దాన్ని మార్చుకుని వెళ్లాలి. ఇది తెలియక చాలామంది అలాగే రైల్లో ఎక్కేశారు. ఇంకేముంది... వారు మియాపూర్లో దిగగానే ఫైన్లతో అధికారులు బెంబేలెత్తించారు. ఈ పరిస్థితిని త్వరలో చక్కదిద్దుతామని రైల్వే అధికారులు వెల్లడించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జియో యూజర్లకు గుడ్‌న్యూస్...