Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హైదరాబాద్ మెట్రోలో జేబుకు స్మార్ట్ కోత... ఎలా?

హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భాగ్యనగరి వాసులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఎంచక్కా స్మార్ట్‌ కార్డుల్లో స్వైప్ చేస్తూ మెట్రో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జులాయిలు, పో

హైదరాబాద్ మెట్రోలో జేబుకు స్మార్ట్ కోత... ఎలా?
, గురువారం, 30 నవంబరు 2017 (09:52 IST)
హైదరాబాద్ నగరంలో మెట్రో రైల్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. దీంతో భాగ్యనగరి వాసులు ఫుల్‌జోష్‌లో ఉన్నారు. ఎంచక్కా స్మార్ట్‌ కార్డుల్లో స్వైప్ చేస్తూ మెట్రో జర్నీని ఎంజాయ్ చేస్తున్నారు. అయితే, జులాయిలు, పోకిరీలుగా తిరిగే వారికి మాత్రం హైదరాబాద్ మెట్రో అధికారులు స్మార్ట్‌గా కోత పెడుతున్నారు. ఫలితంగా వారి జేబుకు చిల్లుపడుతోంది. ఉప్పల్‌కు చెందిన శ్రీనివాస్ అనే ప్రయాణికుడికి ఈ చేదు అనుభవం ఎదురైంది. ఈ వివరాలను పరిశీలిస్తే... 
 
ఈ ఉప్పల్ వాసి నాగోల్‌ స్టేషన్‌లో బుధవారం రూ.200 చెల్లించి స్మార్ట్‌ కార్డు కొన్నాడు. ఇందులో రూ.100 ప్రయాణం కోసం వాడుకోవచ్చు. అయితే ఇతగాడు రైలు ఎక్కకుండా… స్టేషన్‌లో గంట సేపు గడిపేశారు. తీరా బయటకు వచ్చేముందు తన స్మార్ట్‌ కార్డులోని బ్యాలన్స్‌ చెక్ చేసుకుంటే… అందులో బ్యాలెన్స్ కేవలం రూ.12 మాత్రమే ఉంది. దీంతో అతనికి అపుడు అర్థమైంది. 
 
మెట్రో స్టేషన్‌లలో పనీబాటలేని పోకిరీలు సమయం గడపడానికి వీల్లేదనీ, ఒకవేళ స్టేషన్‌లో టైమ్ స్పెండ్ చేయాలంటే డబ్బు ఖర్చు చేయాల్సిందేనన్న విషయం. రైలులో ప్రయాణించకుండా స్టేషన్‌లో ఎక్కువసేపు తచ్చాడితే ఇలాగే జరుగుతుందని మెట్రో అధికారులు చెపుతున్నారు. 
 
ముఖ్యంగా, స్మార్ట్ కార్డు ఉన్నవారు పెయిడ్‌ ఏరియాలోకి ప్రవేశించి రైలు ఎక్కకుండా ఓ గంట సేపుగడిపి మళ్లీ బయటకు వస్తే ఛార్జీలు చెల్లించాల్సిందే అంటున్నారు. ప్రవేశించిన సమయం నుంచి మొదలుకుని మళ్లీ బయటకు వచ్చే వరకు ఎంతసేపు స్టేషన్‌లో ఉంటామో.. ఆ సమయం ప్రయాణ సమయంతో సరిపోలి డబ్బులు కార్డులో ఆటోమేటిక్‌గా డెబిట్ అవుతాయని మెట్రో అధికారులు వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మెట్రోకి జనం భాగ్యనగరి వాసుల ఫిదా