Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కావ్యమాధవన్‌తో దిలీప్ వివాహేతరసంబంధం.. అందుకే ఆ నటిపై?

సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. గత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని... స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సి

కావ్యమాధవన్‌తో దిలీప్ వివాహేతరసంబంధం.. అందుకే ఆ నటిపై?
, శుక్రవారం, 24 నవంబరు 2017 (13:54 IST)
సినీ నటి కిడ్నాప్, లైంగిక వేధింపుల కేసులో మలయాళ నటుడు దిలీప్‌పై పోలీసులు ఛార్జీషీట్ దాఖలు చేశారు. గత ఫిబ్రవరి 17న కేరళలోని ఎర్నాకుళం సమీపంలో షూటింగ్ పూర్తి చేసుకుని... స్నేహితురాలి ఇంటికి వెళ్తున్న సినీ నటిపై లైంగిక వేధింపుల కేసులో సిట్ అధికారులు బలమైన సాక్ష్యాధారాలతో న్యాయస్థానంలో ఛార్జీషీట్ దాఖలు చేశారు. 
 
ఈ ఛార్జీషీట్‌లో దిలీప్ రెండో భార్య మంజు వారియర్‌తో బాధితురాలికి మంచి స్నేహం వుందని.. అయితే దిలీప్ వ్యహారంలో తేడా కనిపించడంతో పాటు వారి దాంపత్యంలో ఏర్పడిన విభేదాలు చోటుచేసుకున్నాయి. ఈ క్రమంలో కావ్యమాధవన్‌‌తో దిలీప్‌కు ఉన్న వివాహేతర సంబంధాన్ని బాధితురాలు పూర్తి ఆధారాలతో బట్టబయలు చేయడంతోనే కక్ష పెంచుకున్న దిలీప్.. పల్సర్ సునీ సాయంతో దారుణానికి ఒడిగట్టినట్లు ఛార్జీషీట్‌లో సిట్ పేర్కొంది. 
 
ఈ కేసులో పల్సర్ సునీని తొలి ముద్దాయిగా, దిలీప్‌ను ఎనిమిదో ముద్దాయిగా సిట్ అధికారులు పేర్కొన్నారు. ఇంకా తొలి సాక్షిగా బాధితురాలి పేరును సిట్ పేర్కొంది. మంజు వారియర్, కావ్యమాధవన్‌తో పాటు మాలీవుడ్ చిత్రపరిశ్రమకు చెందిన మరో 50 మందిని కూడా ఛార్జీషీట్‌లో సాక్షులుగా సిట్‌లో పేర్కొంది. అంతేగాకుండా దిలీప్ పల్సర్ సునీకి కిడ్నాప్, లైంగిక వేధింపుల ప్లానుకు రూ.1.5కోట్లు ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రామ్ గోపాల్ వర్మ- నాగార్జున సినిమాలో దేవసేన