Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆర్టీసీ బస్సు చార్జీలపై ఆందోళన - బండి సంజయ్ హౌస్ అరెస్టు

Webdunia
శుక్రవారం, 10 జూన్ 2022 (13:19 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆర్టీసీ బస్సు ప్రయాణ చార్జీలను భారీగా పెంచేసింది. ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు తీవ్రంగా గగ్గోలు పెడుతూ ఆందోళనకు దిగాయి. బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనకు ఆ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇందులోభాగంగా, జేబీఎస్ వద్ద నిరసన కార్యక్రమానికి బీజేపీ నేతలు సిద్ధమయ్యారు. దీంతో తెలంగాణ బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. ఆందోళన జరిగే ప్రాంతానికి వెళ్లకుండా పోలీసులు అడ్డుకున్నారు. 
 
బంజారా హిల్స్‌లోని ఆయన ఇంటి చుట్టూత పోలీసు బలగాలను మొహరించారు. దీంతో ఆయన బయటకు రాలేని పరిస్థితి ఏర్పడింది. ఆర్టీసీ చార్జీల పెంపుతో సామాన్య ప్రజానీకంపై మరింత భారం మోపారని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఆర్టీసీ చార్జీలు పెంచడం మూర్ఖత్వమా? అంటూ ఆయన ప్రశ్నిస్తున్నారు. తెరాస మూడేళ్ల పాలనలో ఇప్పటివరకు ఐదుసార్లు బస్సు చార్జీలను పెంచిందని గుర్తుచేశారు. 
 
పేదలను బస్సులో కూడా ప్రయాణించకుండా చేస్తారా అంటూ ఆయన మండిపడ్డారు. తెరాస ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బస్సు చార్జీలు 60 శాతం మేరకు పెంచారని ఆయన ఆరోపించారు. తెలంగాణ పోలీసులకు రేపిస్టులను అరెస్టు చేయడం చేతకాదు గానీ, బీజేపీ నేతల గృహాలను మాత్రం ముట్టడించడం బాగా తెలుసని బండి సంజయ్ నిప్పులు చెరిగారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Deepika: భారత చిత్ర పరిశ్రమలో పనిచేసే తల్లులకు మద్దతు లేదు-రాధికా ఆప్టే

Prabhas : ప్రభాస్ రాజాసాబ్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Anushka: ఘాటి కోసం మూటాముల్లి తో కాలువ దాటుతున్న అనుష్క శెట్టి హైలైట్

Kiran Abbavaram: కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరి ప్రియ టైటిల్ చెన్నై లవ్ స్టోరీ

Nidhhi Agerwal: శింబుతో నిధి అగర్వాల్ ప్రేమాయణం.. పవన్ బ్యూటీ ఏం చెప్పిందంటే?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

బాదం పాలు తాగితే ముఖ్య ప్రయోజనాలు, ఏంటవి?

Okra Water: బెండకాయలు నానబెట్టిన నీరు చాలు.. హెయిర్ ఫాల్‌కు గుడ్ బై.. ఎలా?

రోగనిరోధక శక్తిని సహజసిద్ధంగా పెంచడానికి మీ రోజువారీ ఆహారంలో చేర్చుకోవాల్సిన ఆహారాలు

తర్వాతి కథనం
Show comments