రేపు ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపు

Webdunia
సోమవారం, 22 ఆగస్టు 2022 (14:39 IST)
తెలంగాణ ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ బీజేపీ అనుబంధ విద్యాసంస్థ అయిన అఖిల భారత విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) మంగళవారం తెలంగాణాలో విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చారు. ఈ విషయాన్ని ఆ రాష్ట్ర ఏపీవీపీ కార్యదర్శి ప్రవీణ్ రెడ్డి తెలిపారు. 
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ, ఇంటర్ విద్యా విధానంలో కార్పొరేట్ కాలేజీలను ప్రభుత్వం నియంత్రించడం లేదని ఆరోపించారు. అందుకే కార్పొరేట్ విద్యా సంస్థల ముందు ఏబీవీపీ ఆందోళన చేపడుతుందని తెలిపారు. 
 
ఇందులోభాగంగా, సోమవారం నారాయణగూడలోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీ ముందు ఏబీవీపీ నాయకులు ధర్నాలు చేశారు. కార్పొరేట్ విద్యా సంస్థలపై ఇంటర్ బోర్డు అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని వారు ఆరోపిస్తున్నారు. ఈ వైఖరిని ఖండిస్తూ మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా విద్యా సంస్థల బంద్‌కు పిలుపునిచ్చినట్టు ఆయన వెల్లడించారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Anupama Parameswaran: క్రేజీ కల్యాణం నుంచి అనుపమ పరమేశ్వరన్ బర్త్ డే పోస్టర్

Suhas: నా ముందే ఒకాయన సెట్‌లో ఇతన్నెందుకు పిలిచారు అన్నాడు: సుహాస్‌

5 ఏళ్ల క్రితం తీసిన సినిమా అప్పులు ఇంకా కడుతున్నాను: మంచు లక్ష్మి

పెద్దలకు భయపడి ప్రత్యూష చిత్రం నుంచి తప్పుకున్నారు : సత్యారెడ్డి

Vijay Antony: బుకీ తెలుగు ఆడియన్స్ కి నచ్చుతుంది : విజయ్ ఆంటోనీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపీ వున్నవారు ఈ పదార్థాలు తింటే...?

అలోవెరా జ్యూస్ తాగితే ఏం జరుగుతుంది?

హైదరాబాద్‌లో టిఏఎల్ హెల్త్ ఫెస్ట్ 2026 ను నిర్వహించిన టచ్-ఎ-లైఫ్ ఫౌండేషన్

ప్రేమకు సరికొత్త భాష: శ్రద్ధను, ఉద్దేశాన్ని చాటిచెప్పే వాలెంటైన్స్ డే బహుమతులు

చక్కెర స్థాయిలు తగ్గించి ఎముకపుష్టికి ఉపయోగపడే గోధుమరవ్వ వంటకం

తర్వాతి కథనం
Show comments