Webdunia - Bharat's app for daily news and videos

Install App

వివాహం జరిగి 48 గంటలు గడవకముందే విషాదం.. నలుగురు మృతి

Webdunia
శనివారం, 22 జూన్ 2019 (15:33 IST)
యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ముక్తాపురం గ్రామంలో పెళ్లి ఇంట విషాదం జరిగింది. నవ వరుడుతో పాటు తల్లిదండ్రులు విద్యుత్ షాక్ తగిలి నలుగురు మృత్యువాత పడ్డారు. ఆ ఇంట వివాహం జరిగి 48 గంటలు కూడా గడవకముందే ఈ దారుణం జరగడంతో కన్నీటి పర్యంత అవుతున్నారు కుటుంబ సభ్యులు. 
 
వర్షం పడుతున్న కారణంగా బయట ఆరేసిన బట్టలు తీయడానికి వెళ్లిన ఈ నలుగురూ ఒకరి తరువాత ఒకరు షాక్‌కు గురై చనిపోయినట్టు తెలుస్తోంది. పెళ్లి పందిరి అలంకరణకు ఫోకస్ లైట్లను అమర్చారు. దానికి సపోర్టుగా ఉండేలా ఒక వైరును బిగించి ఇనుప రాడ్డుకు చుట్టారు. 
 
అదే రాడ్డుకు బట్టలు ఆరేయడానికి మరొక వైరును కూడా బిగించడంతో విద్యుత్ షార్ట్ సర్కూట్ అయింది. వర్షం పడటంతో బట్టలు తీసేందుకు వెళ్లిన వారు ఒకరి తరువాత ఒకరు చనిపోయారు. చనిపోయిన వారిలో పెళ్లి కొడుకు చిందం ప్రవీణ్, పెళ్లి కొడుకు తండ్రి చిందం సాయిలు, పెళ్ళి కొడుకు తల్లి చిందం గంగమ్మ.. పెళ్లి కొడుకు మేనత్త శామల గంగమ్మ నలుగురు చనిపోయారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమాల్లో రాణించాలంటే ప్రతిభను నిరూపించుకోవాలి : హీరో మంచు మనోజ్

పాకిస్థానీ నటి హుమైరా అస్కర్ అలీ అనుమానాస్పద మృతి

Sirisha: సుడిగాలి సుధీర్ పెళ్లిచేసుకోడు : ధనరాజ్ భార్య శిరీష స్టేట్ మెంట్

Manoj: విజయ్‌సేతుపతిలా తెలుగులో సుహాస్‌ : మంచు మనోజ్‌

RK Sagar: ఆయన చనిపోయినప్పుడు చాలా పీలయ్యా : ఆర్.కె. సాగర్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

ఆ మొక్క ఆకులో నానో బంగారు కణాలు!!

బరువు తగ్గాలనుకుంటున్నారా? సగ్గుబియ్యం ఓ వరం!

నేరేడు పళ్ల సీజన్... నేరేడు ప్రయోజనాలెన్నో!

Back pain: మహిళలకు వెన్నునొప్పి ఎందుకు వస్తుందో తెలుసా?

తర్వాతి కథనం
Show comments