Webdunia - Bharat's app for daily news and videos

Install App

స్మార్ట్ ఫోన్ కొనివ్వలేదని తండ్రిపై కోపం.. ఉరేసుకుని బాలుడి బలవన్మరణం

Webdunia
శుక్రవారం, 22 జులై 2022 (12:56 IST)
స్మార్ట్ ఫోన్లు ప్రాణాలను మింగేస్తున్నాయి. మొబైల్ ఫోన్‌ వాడాల్సినంత అవసరం లేకపోయినప్పటికి చిన్నారులు గేమ్స్‌కు అలవాటు పడుతున్నారు. స్మార్ట్ ఫోన్ కొనివ్వాల్సిందేనని టీనేజర్లు పట్టుబడుతున్నారు. ఫోన్ కొనివ్వకపోతే ప్రాణాలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు. 
 
తాజాగా అలాంటి ఘటనే భద్రాద్రి కొత్తగూడెంలో చోటుచేసుకుంది. స్మార్ట్ ఫోన్ కోసం కన్నబిడ్డ దూరమవడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు బోరున విలపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు పట్టణం 9వ వార్డులో బానోతూ శివలోకేష్ అలియాస్ సోనూ అనే పదిహేనేళ్ల బాలుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఇంట్లోని కొక్కానికి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకున్నాడు. 
 
చనిపోయిన బాలుడు శివ లోకేష్ స్థానిక మాంటిసోరి స్కూల్‌లో పదవ తరగతి చదువుతున్నాడు. మృతుడు శివలోకేష్‌ తండ్రిని సెల్‌ఫోన్‌ కొనివ్వమని గత కొద్దిరోజులుగా కోరుతున్నాడు. కొనివ్వలేదనే మనస్తాపంతోనే ఈ విధంగా ప్రాణాలు తీసుకున్నట్లుగా స్థానికులు, పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంజనీర్ ఓ అమ్మాయి ప్రేమలో పడితే ఏమయిందంటే... ప్రదీప్ మాచిరాజు

Kalyan Ram: అమ్మల కోసం త్యాగం చేయాలి, అందుకే ఈ సినిమాని అమ్మలకు అంకితం : కళ్యాణ్ రామ్

పెళ్ళికి సిద్ధమవుతున్న చెన్నై చంద్రం?

అరుణాచలంలో ఆ హీరో - హీరోయిన్ చేసిన పనికి మండిపడుతున్న భక్తులు!!

టాలీవుడ్‌లో విషాదం : నిర్మాత ముళ్లపూడి బ్రహ్మానందం కన్నుమూత

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బెల్లీ ఫ్యాట్ కరిగిపోయి అధికబరువు తగ్గిపోవాలంటే?

దగ్గుతో రక్తం కక్కుకుంటున్నారు, రష్యాలో కొత్తరకం వైరస్, వేలల్లో రోగులు

అలాంటి వేరుశనక్కాయలు, ఎండుమిర్చి తింటే కేన్సర్ ప్రమాదం

Hot Water: వేసవిలో వేడి నీళ్లు తాగవచ్చా? ఇది ఆరోగ్యానికి మంచిదా?

వేసవి ఎండల్లో ఈ 9 పండ్ల రసాలు తాగితే?

తర్వాతి కథనం
Show comments